గ్రామీణ నేపథ్యంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరణ అభినందనీయం
పేటలో సందడి చేసిన సినీతార అయేషా పాటిల్
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి,
గ్రామీణ ప్రాంత స్థితిగతులను అక్కడి వాతావరణాన్ని చక్కగా పాట రూపంలో పల్లె నా పల్లె పాట చిత్రీకరించి ఆవిష్కరించడం అభినందనీయమని 45వ వార్డు కౌన్సిలర్ గండూరి పావని కృపాకర్ అన్నారు. కలియుగంలో పట్నం, హరిహర వీరమల్లు చిత్రాల ఫేమ్ సినీనటి ఆయేషా పాటిల్ తో కలసి పల్లె నా పల్లె పాట ను బుధవారం ఆవిష్కరించి మాట్లాడారు. పల్లె నా పల్లె పాట చాలా బాగుందని పాటలో చిన్నారుల నటన అద్భుతంగా ఆకట్టుకుందన్నారు. పాటకు సంబంధించిన లిరిక్స్ తో పాటు మ్యూజిక్ డైరెక్షన్ అంత చక్కగా కుదిరిందని పల్లె వాతావరణం లో ఆ స్నేహాన్ని ఆనాటి స్థితిగతులను వివరిస్తూ చక్కగా పాఠ చిత్రీకరించారని కొనియాడారు. పల్లె నా పల్లె పాటను ప్రతి ఒక్కరు వీక్షించాలని కోరారు. అనంతరం సినీ తార ఆయేషా పాటిల్ చిన్నారులు ప్రజలతో కలసి సెల్ఫీలు దిగుతూ సందడి చేశారు. తాను గతంలో చేసిన చిత్రాలు ప్రస్తుతం చేయబోతున్న చిత్రాల విశేషాలను అభిమానులతో పంచుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా బిఆర్ఎస్ నాయకులు గండూరి కృపాకర్, పాట డైరెక్టర్ జెర్రిపోతుల రవి, నటీనటులు సుమలత, సుమశ్రీ, స్వప్నశ్రీ, ఎడిటింగ్ రామ్ రెడ్డి, గానం ఇమ్మడి అశోక్, మ్యూజిక్ బొబ్బిలి సురేష్, రమేష్, బెజగం ఫని, బజ్జూరి శ్రీనివాస్, వీరభద్రం, కుక్కడపు బిక్షం, కళ్యాణ్, సందీప్, ఇస్మాయిల్ తదితరులు ఉన్నారు.