గ్రామీణ స్థితిగతులను అధ్యయనం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10:
గ్రామీణ కృషి అనుభవ కార్యక్రమంలో భాగంగా లయోలా అకాడమీ సికింద్రాబాద్ కి చెందిన బిఎస్సి వ్యవసాయ డిగ్రీ కోర్సు విద్యార్థులు గ్రామీణ వ్యవసాయ విధానాలు స్థితిగతులను తెలుసుకొని గ్రామీణ భాగస్వామ్య విశ్లేషణ(పిఆర్ఎ) ద్వారా అధ్యయనం చేసినట్లు కెవికె గడ్డిపల్లి ప్రోగ్రామ్ అసిస్టెంట్, రావే ఇన్చార్జి ఆకుల నరేష్ తెలిపారు. మున్సిపల్ పరిధిలోని 8వ వార్డు కుసుమవారి గూడెంలో మంగళవారం నిర్వహించిన గ్రామీణ అవగాహన సదస్సులో ఆయన పాల్గొన్నారు. వ్యవసాయ విద్యార్థులు గ్రామ పటం ద్వారా గ్రామంలోని మౌలిక సదుపాయాలు, సాగు భూమి విస్తీర్ణం, నీటి పారుదల, నేల రకాలు, వ్యవసాయ రంగంలో రైతులు ఎదుర్కొంటున్న సమస్యలను గురించి ఈ సదస్సులో వివరించారు. ఈ సంధర్భంగా విద్యార్దులు గ్రామంలో రైతులు ఎక్కువగా వరి పంటనే పండిస్తున్నారని, ఓకే పంట పండించడం వలన చీడపీడలు ఎక్కువ అవుతున్నాయని రైతులకు తెలిపారు. అనంతరం కృషి విజ్ఞాన కేంద్రం చేపడుతున్నటువంటి కార్యక్రమాల గురించి నరేష్ వివరించారు. రైతులు సరైన అవగాహన లేక రసాయన ఎరువులు వాడుతున్నారని తెలిపారు. సమగ్ర ఎరువుల యాజమాన్యం, ఇతర పంట సాగు గురించి రైతులకు వివరించారు. ఈ కార్యక్రమంలో సామాజికవేత్త గంగా లింగారెడ్డి, రైతులు జిన్న చంద్రారెడ్డి, ఇరగదిoడ్ల సైదులు, వెన్న మధుసూదన్ రెడ్డి, జూలకంటి నాగేందర్ రెడ్డి, కుర్రి నాగయ్య, కుర్రి శేఖర్, పోతురాజు సాగర్,జిన్న ప్రభాకర్ రెడ్డి, వల్లపట్ల నాగయ్య, వల్లపట్ల ఉపేందర్, ఇరగదిoడ్ల యాదగిరి తదితర పాల్గొన్నారు.