31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

ఘనంగా తెలంగాణ విమోచన దినోత్సవం.

తెలంగాణ విమోచన దినోత్సవం సందర్భంగా సర్దార్ పటేల్ విగ్రహం వద్ద జాతీయ జెండా ఆవిష్కరించారు.

సిరిసిల్ల యదార్థవాది ప్రతినిది

సిరిసిల్ల జిల్లా పట్టణంలో ఆదివారం జిల్లా ఓబీసీ మోర్చా ఆధ్వర్యంలో ఘనంగా విమోచన దినోత్సవన్ని విశ్వకర్మ జయంతి, ప్రధాని నరేంద్ర మోడీ పుట్టినరోజును నిర్వహించి, విశ్వబ్రాహ్మణులకు పలుఫురిని సన్మానించి కరీంనగర్ పార్లమెంటు కన్వీనర్ ఆడేపు రవీందర్ మాట్లాడుతూ 1948వ సంవత్సరం సెప్టెంబర్ 17వ తేదీన సువిశాల భారతదేశంలో తెలంగాణ అంతర్భాగంగా మారి రాచరిక పరిపాలన నుండి ప్రజాస్వామ్య దశలోకి పరివర్తన చెందింది. అందుకు యావత్ తెలంగాణ సమాజం అద్భుతంగా కృషి చేసిన విషయం మనందరికీ తెలిసిందేనని ఆనాటి వీరయోధులైన కొమరం భీమ్, దొడ్డి కొమురయ్య, రావి నారాయణరెడ్డి, స్వామి రామానంద తీర్థ. సర్దార్ జమలాపురం కేశరావు, వట్టికోట ఆళ్వార్ స్వామి, చాకలి ఐలమ్మ, భీంరెడ్డి నర్సింహారెడ్డి, ఆరుట్ల రామచంద్రారెడ్డి, ఆరుట్ల కమలాదేవి, బద్దం ఎల్లారెడ్డి, సురవరం ప్రతాపరెడ్డి, ప్రజాకవి కాళోజి, మగ్దూం మొహియొద్దీన్, షోయబుల్లాఖాన్, బండి యాదగిరి, దాశరథి కృష్ణమాచార్య, సుద్దాల హనుమంతు ఇంకా ఎందరో మహానుభావులు వారందరికీ శిరస్సువంచి నమస్కరిస్తున్నమని అన్నారు. కార్యక్రమంలో భారత జనతా పార్టీ పట్టణ అధ్యక్షులు నాగుల శ్రీనివాస్, జిల్లా ఉపాధ్యక్షులు శీలం రాజు ఓ బి సి కార్యాలయ కార్యదర్శి గౌడ వాసు ఓబీసీ రాష్ట్ర కార్యవర్గ సభ్యులు దాసరి శ్రీనివాస్ అసెంబ్లీ కన్వీనర్ కరెడ్ల మల్లారెడ్డి పట్టణ ప్రధాన కార్యదర్శి ఎనిగంటి నరేష్ ఓబీసీ జిల్లా ప్రధాన కార్యదర్శి గుండెల్లో వేణు పట్టణ ఓబిసి అధ్యక్షుడు సిరిగాధ మైసయ్య ఉరగొండ రాజు మోర శ్రీహరి గాజుల వేణు కోడం ఆనంద్ బాబు తడక విజయ్ సుంచు ప్రకాష్ సిరిమల్లె మల్లేశం చొప్పదండి శ్రీనివాస్ గుడ్ల విష్ణు రాయిని ప్రతాప్ ఎల్లంకి సతీష్ వేముల పోశెట్టి బాలకిషన్ పోతు శ్రీనివాస్ మొగిలి రాజు మహేశుని అనిల్ అంకారపు రాజు రమేష్ చారి ఇంజపూరి మురళి సత్య సాయిరాం దూడం శ్రీనివాస్ దేవేందర్ రెడ్డి బిజెపి నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్