ఘనంగా రైతు దినోత్సవ వేడుకలు
యదార్థవాది న్యూస్ కొండపాక
కొండపాక మండలపరిధిలోని వెలికట్ట క్రాస్ రోడ్డులో గురువారం భారతీయ కిసాన్ సంఘ్ ఆధ్వర్యంలో తెలంగాణ శాఖ భాద్రపద శుద్ధ షష్టి బలరాముని జయంతి, రైతు దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపి జెండా ఆవిష్కరించారు. ఈ సందర్భంగా మండల అధ్యక్షుడు పర్శరాంలు గౌడ్ మాట్లాడుతూ రైతులు సుఖ సంతోషాలతో ఉంటేనే ప్రభుత్వాలు బాగుంటాయని ఎద్దు ఏడిస్తేరైతు , రైతుఏడిస్తే దేశము బాగుపడినదాఖలాలు లేవన్నారు. అందుకే ప్రభుత్వాలు మేలుకొని రైతువ్యతిరేకపనులు మానుకుని రైతులకు అనుకూలమైనా పాలన కొనసాగించాలని, రైతును ఆదరించి వాళ్ళను ప్రోత్సహించాలని కోరారు, రైతుల తరుపున భారతీయ కిసాన్ సంఘం ఎల్లవేళలా పనిచేస్తు రైతుల పక్షాన పోరాటముచేస్తూన్న నిస్వార్ధమైన సంస్థకేవలం భారతీయ కిసాన్ సంఘ్ మాత్రమే అన్నారు. రైతుకు ఏ కష్టం వచ్చినా, నష్టం వచ్చినా ముందుండి పోరాడతామన్నారు. కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి కే శ్రీనివాస్ రెడ్డి , జిల్లా కార్యవర్గ సభ్యులు శ్రీనివాస్, మండల ఉపాధ్యక్షులు బిక్షపతి యాదవ్, మండల కార్యవర్గ సభ్యులు ఈ. హరీష్ , పి వేణు, రైతులు పాల్గొన్నారు