ఘనంగా సమైఖ్య క్రిస్మస్
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11: జిల్లా కేంద్రంలోని మన్నా చర్చ్ బిషప్ డా. సాల్మాన్ రాజు నివాసం లో సూర్యాపేట పాస్టర్స్ పెలోషిఫ్ సలహాదారులు బిషప్ సాల్మన్ రాజు ఆధ్వర్యంలో సూర్యాపేట సమైఖ్య క్రిస్మస్ సందర్బంగా కేక్ కట్ చేసి స్విట్స్ పంచిపెట్టున్నారు. అనంతరం బిషప్ సాల్మాన్ రాజు పట్టణ నియోజకవర్గ ప్రముఖ దైవజనులందరికి పూల బొకే, శాలువాలతో సత్కరించారు. ఈ సందర్బంగా రెవ. డా. యం. ప్రభుదాసు (బాప్టిస్ట్ చర్చ్) మాట్లాడుతూ సంస్థలు, సంఘ పెలోషిఫ్ ల బేధములు లేకుండా సమిష్టి తో జిల్లా వ్యాప్తంగా క్రీస్తూ ప్రేమను చాటలని, సహోదరులు ఐక్యత కలిగి నివసించుట ఎంత మేలన్నారు. ఈ కార్యక్రమం లో రెవ. డా శాంసంగ్ మామిడి, రెవ. డా జాన్ మార్కు, రెవ. బి. జవహర్ పాల్, బిషప్ దుర్గం ప్రభాకర్, బ్రదర్ యం. ప్రభుదాస్, రెవ. ఇంజమూరి గాబ్రియేల్, రెవ. మిట్టగడుపుల హాజర్య, బ్రదర్ జాటోత్ డేవిడ్ రాజు,రెవ. జి. బాలాజీ నాయక్,రెవ. జి. బాబురావు, రెవ. డా. ధరవత్ లాకు నాయక్, రెవ. డా పంది మార్కు, పాస్టర్ యం రూబెన్ తదితరులు పాల్గొన్నారు.