31.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణచిరస్మరణీయం ఘంటసాల గానామృతం

చిరస్మరణీయం ఘంటసాల గానామృతం

చిరస్మరణీయం ఘంటసాల గానామృతం

సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 5: శ్రీ జ్ఞాన సరస్వతి సాంస్కృతి కళావేదిక ఆధ్వర్యంలో అమర గాయకుడు పద్మశ్రీ ఘంటసాల 102 వ జయంతి సందర్భంగా నిర్వహించిన రాష్ట్ర స్థాయి పాటల పోటీలలో గెలుపొందిన విజేతలకు ముఖ్య అతిథిగా హాజరైన ఆర్డివో ఆర్. వేణుమాధవ్ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు. కళావేదిక అధ్యక్ష, కార్యదర్శులు జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, సామాజికవేత్త, గాయకులు, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ విశ్రాంత అవార్డు గ్రహీత గుండా రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ బహుమతి గోపనబోయిన వెంకటేశ్వర్లు రూ.4000 రెవెన్యూ డివిజన్ అధికారి ఆర్ వేణుమాధవ్ ప్రధమ ద్వితీయ తృతీయ బహుమతులను అందజేశారు కళావేదిక అధ్యక్ష కార్యదర్శులు జూనియర్ ఘంటసాల బుర్రి వెంకటేశ్వర్లు, సామాజికవేత్త, గాయకులు, ప్రభుత్వ ఉత్తమ ఉపాధ్యాయ విశ్రాంత అవార్డు గ్రహీత గుండా రమేష్ కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రథమ బహుమతి గోపనబోయిన వెంకటేశ్వర్లు రూ.4000 హుజూర్నగర్, ద్వితీయ బహుమతి వై. రేణు దీక్షిత మహబూబాబాద్, తృతీయ బహుమతి జి ఉపేంద్ర చారి సూర్యాపేట, ప్రత్యేక ప్రశంసా బహుమతి పందిరి సత్యం కుక్కడం వారికి నగదు బహుమతులుగా ప్రధానోత్సవానికి ముఖ్యఅతిథిగా హాజరైన ఆర్డీవో వేణుమాధవ్ అందజేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ అలనాటి మధుర గాయకుడు, తెలుగు సినీ ప్రపంచ సంగీత దర్శకునిగా ప్రజలను తన గానామృతంతో ఉత్తేజపరిచిన పద్మశ్రీ ఘంటసాల అందరి హృదయాలలో చిరస్మరణీయుడని ఇలాంటి సాంస్కృతిక కార్యక్రమాలు నిర్వహించడం జ్ఞాన సరస్వతి కళావేదిక కమిటీ అభినందనీయమని అన్నారు. మరొక గౌరవ అతిధి మనం వికాస వేదిక అధ్యక్షులు పెద్దిరెడ్డి గణేష్ మాట్లాడుతూ కళ, కళ కోసం కాదు సమాజం కోసమని ఇలాంటి అద్భుత కార్యక్రమాలు నిర్వహించిన రసజ్ఞులు గుండా రమేష్, బుర్రి వెంకటేశ్వర్లు వారి కార్యవర్గాన్ని ప్రశంసించారు. ఈ కార్యక్రమంలో అతిధులుగా గండూరి శంకర్, యామా ప్రభాకర్, కర్నాటి సురేందర్ నాగవల్లి ప్రభాకర్ కల్లూరు నాగయ్య, బి రాధాకృష్ణారెడ్డి, చకిలం కవిత, దేవులపల్లి ప్రశాంతి, హమీద్ ఖాన్, తదితరులు హాజరైనారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్