29.2 C
Hyderabad
Sunday, February 9, 2025
హోమ్తెలంగాణచెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతం: జిల్లా కలెక్టర్

చెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతం: జిల్లా కలెక్టర్

చెరువులు నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లం అవుతం: జిల్లా కలెక్టర్

గజ్వేల్ యదార్థవాది

జిల్లాలో రిజర్వాయర్ ద్వారా చెరువులకు నీరు అందించడానికి కావలసిన కాలువల భూ సేకరణ యుద్ధ ప్రాతిపదికన పూర్తి చెయ్యాలని కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్..
గజ్వేల్ ఐఓసీలో శనివారం నీటిపారుదల, రెవెన్యూ అదికారులతో జిల్లా కలెక్టర్ సమావేశం నిర్వహించారు.. సమావేశం లో జిల్లా ఆయన మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రైతులకు మేలు చేయడానికి పెద్ద ఎత్తున రిజర్వాయర్లు యుద్ధ ప్రాతిపదికన నిర్మాణం పూర్తి చేశారని జిల్లాలో రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ సాగర్ లాంటి రిజర్వాయర్, తపాస్ పల్లి రిజర్వాయర్
ల నుండి కాలువల ద్వారా ప్రతి చెరువు నీటిని నింపడానికి కావలసిన భూసేకరణ మండలాల వారిగా అధికారులతో చర్చించారు. భూసేకరణలో రెవెన్యూ, సర్వేయర్ ల పాత్రఅని ప్రతి గ్రామంలో ఏ ఒక్క చెరువు కుడా ఎండకుండా ఎండాకాలంలో సైతం నీటితో కలకలాడితే రైతులకు ఎంతో మేలు చేసిన వాళ్లంఅవుతమని అన్నారు.
గ్రామాల్లో మండల తహసీల్దార్, సర్వేయర్లు ఆర్డీఓల సహకారంతో కాలువల భూసేకరణ ప్రక్రియ వేగవంతం పూర్తి చెయ్యాలని, సర్వేయర్ అందించిన భూసేకరణ సంబంధిత ఇరిగేషన్ అనుమతులను వెంటనే తహశీల్దార్ లకు అందించిన వెంటనే రైతులకు నష్ట పరిహారం అందజేసి భూమిని ఆధీనంలోకి తీసుకోవాలి. ఈ పక్రియ యుద్ధ ప్రాతిపదికన జరగాలి. అధికారులు పనుల్లో అలసత్వం ప్రదర్శిస్తే కఠిన నిర్ణయాలు తీసుకోవడంలో వెనుకాడబోమని తెలిపారు. కాలువలకు భూమిని కోల్పోయిన రైతులు అధైర్య పడవద్దని మంచి నష్ట పరిహారం ఇప్పిస్తామని తెలపాలన్నారు. భూసేకరణ ప్రక్రియలో ఎలాంటి అవరోధాలు ఎదురైన పక్కా ప్రణాళికతో పకడ్బందీగా పూర్తి చెయ్యలని అధికారులను ఆదేశించారు. కార్యక్రమంలో ఏప్డిసి చైర్మన్ ప్రతాప్ రెడ్డి, సిద్దిపేట, గజ్వేల్ ఆర్డిఓలు రమేష్ బాబు, విజేందర్ రెడ్డి, గడా అధికారి ముత్యం రెడ్డి, గజ్వేల్ ఇరిగేషన్ సర్కిల్ సూపరింటెండెంట్ ఇంజనీర్ వేణు, ఎడి సర్వేల్యాండ్ వినయ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్