జర్నలిస్టులకు అండగా ఉంటా ఎమ్మెల్యే బాజిరెడ్డి గోవర్ధన్.
యదార్థవాది ప్రతినిధి సిరికొండ
జర్నలిస్ట్ సోదరులకు అన్ని విధాలుగా అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్ర ఆర్టీసీ కార్పొరేషన్ చైర్మన్ నిజామాబాద్ రూరల్ శాసనసభ్యులు బాజిరెడ్డి గోవర్ధన్ అన్నారు.గురువారం సిరికొండ మండలానికి చెందిన పత్రిక విలేకరులు హైదరాబాదులోని ఎమ్మెల్యే నివాసంలో మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్చం అందజేసి శాలువాతో సన్మానించారు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చేపడుతున్న సంక్షేమ పథకాలను జర్నలిస్టు మిత్రులకు అందేలా చూడాలని ఎమ్మెల్యేను కోరడంతో ఎమ్మెల్యే స్పందిస్తూ ప్రభుత్వం తరఫున అందే సంక్షేమ పథకాలను వర్తింప చేసేలా కృషి చేస్తానని హామీ ఇచ్చారు. దీంతో జర్నలిస్ట్ మిత్రులు ఎమ్మెల్యే స్పందనకు హర్షం వ్యక్తం చేశారు. ఈ కార్యక్రమంలో జర్నలిస్టులు అంగూరి గణేష్ గౌడ్, ములుగు రాజేశ్వర్, నూనె నరేందర్, సిహెచ్ ముక్కంటి, బాదె వినోద్, బాడాల సంతోష్ ఆర్ చందన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.