జర్నలిస్టులకు రక్షణ చట్టాన్ని తేవాలి.
– గాంధీ విగ్రహానికి వినతి పత్రం అందజేస్తు నిరసన తెలిపిన కొండపాక జర్నలిస్టులు.
కొండపాక యదార్థవాది
మండల పరిధిలోని దుద్దెడ రోడ్డుగాంధీ చౌరస్తాలో ఇండియన్ జర్నలిస్ట్ యూనియన్ పిలుపు మేరకు “సేవ్ జర్నలిజం” నినాదం తో అక్టోబర్ 2 మహాత్మ గాంధీ జయంతి పురస్కరించుకొని సోమవారం కొండపాక జర్నలిస్టుల గౌరవ సలహా దారులు చిలుముల వెంకటేశం, జర్నలిస్ట్ సంఘం అధ్యక్షులు నిమ్మ నరసింహ రెడ్డి, సిద్దిపేట జిల్లా టీయూడబ్లుజే కార్యవర్గ సభ్యులు నర్ర సాయి చందర్, ఆధ్వర్యంలో దుద్దెడ మహాత్మ గాంధీ విగ్రహం వద్ద కొండపాక జర్నలిస్ట్ లు అందరూ కలసి నల్ల బ్యాడ్జీ లు ధరించి మహాత్మ గాంధీ విగ్రహానికి వినతి పత్రం సమర్పించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ దేశ వ్యాప్తంగా జాతీయ మీడియా రక్షణ చట్టం ఏర్పాటు చేయాలనీ, జాతీయ మీడియా కమిషన్ ఏర్పాటు చేయాలనీ, అక్క్రిడిటేషన్ కలిగిన జర్నలిస్టులకు కేంద్రం రైల్వే పాసులతోఇవ్వడంతో పాటు పెండింగ్ లో ఉన్న సమస్యలను పరిష్కరించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కొండపాక జర్నలిస్టులు వడ్లకొండ శ్రీనివాస్, ఉపాధ్యక్షులు కుసుంబ శ్రీనివాస్ రావు , గోనె రమేష్, జర్నలిస్టులు పాలడుగు బాల్ రెడ్డి, కాసాని బుచ్చిరెడ్డి, సావిలి పురుషోత్తం పటేల్, వడ్లకొండ సాగర్, పెద్దంకుల నాగరాజు,కానుగంటి సురేష్, కృష్ణారెడ్డి, అక్బర్ పాషా, సత్యం, తదితరులు పాల్గొన్నారు.