26.7 C
Hyderabad
Saturday, May 24, 2025
హోమ్తెలంగాణజర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

జర్నలిస్టుల సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా నూతన కార్యవర్గం ఎన్నిక

నరసరావుపేట యదార్థవాది ప్రతినిది 

జర్నలిస్టుల ఐక్యత సంక్షేమం భరోసా కల్పించేందుకు తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం పనిచేస్తుందని ఆ సంఘం వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు స్పష్టం చేశారు. గురువారం నరసరావుపేట పట్టణంలోని ఎల్.బి. మార్కెట్ వద్ద గల పిల్లి నాగన్న సత్రం నందు పల్నాడు జిల్లా కన్వీనర్ పిల్లి యజ్ఞ నారాయణ ఆధ్వర్యంలో జిల్లా కార్యవర్గ సమావేశం నిర్వహించారు. ఈ సమావేశంలో సంఘం యొక్క ప్రత్యేకత విధి విధానాలు కర్తవ్యాలపై చర్చించారు. అదేవిధంగా జిల్లాలోని అన్ని ప్రాంతాల నుండి హాజరైన జర్నలిస్టుల మధ్య ప్రశాంత వాతావరణంలో నూతన కార్యవర్గం ఎన్నిక ఏకగ్రీవంగా జరిగింది. 

ఏకగ్రీవంగా ఎన్నికైన జిల్లా కమిటీ

తెలుగు సంక్షేమ సంఘం పల్నాడు జిల్లా అధ్యక్షులుగా పేరేచర్ల శ్రీనివాస్ కార్యదర్శిగా జి.ప్రేమ్ సాగర్ కోశాధికారిగా ఎన్.వెంకటేశ్వర్లు గౌరవ అధ్యక్షులుగా పిల్లి యజ్ఞ నారాయణ క్రియాశీలక కార్యదర్శిగా హనుమంతా చారి ఉపాధ్యక్షులుగా కె.నాగేశ్వర రావు జి.సుందర రాజు పల్నాడు హనుమంతరావు సంయుక్త కార్యదర్సులుగా ఎమ్.సునీల్ కుమార్ సూదేపల్లి కోటేశ్వర రావు ప్రచార కార్యదర్శిగా జి.సాంబశివ రావు గౌరవ సలహాదారులుగా ఎన్.రాంప్రసాద్ కార్యవర్గ సభ్యులుగా ఆర్.వెంకటేశ్వర్లు నాయక్ బి.హనుమంతరావు షేక్ వలి టి.వెంకటేష్ సుధీర్ బాబు లను సభ్యులు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు.  ఈ సందర్భంగా ముఖ్య అతిథిగా పాల్గొన్న వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు మాట్లాడుతూ కార్యవర్గ సమావేశం నందు పల్నాడు జిల్లా లోని అన్ని ప్రాంతాల నుండి వివిధ మీడియా ఛానెల్స్  వార్తా పత్రికలలోను పనిచేయుచున్న జర్నలిస్టులు అధిక సంఖ్యలో పాల్గొని నూతన కార్యవర్గాన్ని ఏకగ్రీవంగా ఎన్నుకోవడం పట్ల హర్షం వ్యక్తం చేశారు. నూతనంగా ఏర్పడిన కార్యవర్గ సభ్యులు సంఘ ఆశయాలకు పాటుపడుతూ జర్నలిస్టులకు అండగా వుంటూ సహాయసహకారాలు అందించాలని సూచించారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్