జిల్లాకు సాగునీరు.. మత్స్యకారులలో కొత్త వెలుగులు
యదార్థవాది ప్రతినిది సిద్దిపేట
మత్స్యకారులలో కొత్త వెలుగులు జిల్లాకు సాగునీరు.. మత్స్య సంపద జిల్లాలోని 28వేల కుటుంబాలకు లబ్ధి చేకూరుతుంది. రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ రావు..
సిద్ధిపేట మంత్రి క్యాంపు కార్యాలయంలో గురువారం జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, పోలీస్ కమిషనర్ శ్వేత, ఇరిగేషన్ ఈఈ గోపాల కృష్ణ, మత్స్యశాఖ జిల్లా అధికారి రాములు, నియోజకవర్గ పరిధిలోని అన్నీ మండలాలకు చెందిన ప్రజాప్రతినిధులతో మత్స్యకార పురోభివృద్ధి, రిజర్వాయర్లలో చేపలు పట్టే అంశం, 58, 59 జీఓలు, సుడా ప్రగతి, ఇతరత్రా జిల్లా అభివృద్ధి, పురోగతిపై మంత్రి సమిక్ష సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ జిల్లా వ్యాప్తంగా దాదాపు 28 వేల మంది మత్స్యకారులు ఉన్నారని, వారందరికీ గుర్తింపు కార్డులను పంపిణీ చేయాలని మత్స్యకార శాఖ అధికారిని ఆదేశించారు. దేశంలోనే ప్రధానంగా రంగనాయక సాగర్ లో చేపలను ప్రయివేట్ ఏజెన్సీలకు విక్రయించి వచ్చిన సొమ్మును మత్స్యకార సొసైటీలకు పంపిణీ చేయాలని, రంగనాయక సాగర్ లో మూడేళ్లుగా చేపలు వదలడం జరిగిందని, ఇప్పటి వరకు చేపలు పట్టలేదని, లక్షలాది రకాల విలువైన చేపలు ఉన్నాయని తెలిపారు. వీలైనంత తొందరగా మత్స్యకార సొసైటీ ఎన్నిక నిర్వహించాల్సిన అవసరం ఉన్నదని మంత్రి తెలిపారు.
58, 59 జీఓలకు సంబంధించి లబ్ధిదారులతో త్వరగా పేమెంట్స్ కట్టించి వారికి క్రమబద్ధీకరణ చేసిన పట్టాలు పంపిణీకి సర్వం సిద్ధం చేయాలని జిల్లా కలెక్టర్, రెవెన్యూ అధికారులను మంత్రి ఆదేశించారు. పట్టాలు వస్తే లబ్ధిదారులకు చాలా లబ్ధి చేకూరుతుందని, శాశ్వత హక్కులు వస్తాయని, దీంతో రిజిస్ట్రేషన్ చేసుకునే వెసులుబాటు కలిగి విక్రయించే వీలు ఉంటుందని మంత్రి తెలిపారు.
సుడా పరిధిలో ల్యాండ్ పూలింగ్ -లే అవుట్స్ సిద్ధిపేట మున్సిపాలిటీ పరిధిలో మిట్టపల్లి, పొన్నాలలో భూమి గుర్తించారు. ప్లాటింగ్ చేసి మార్చి నెలాఖరులోగా యాక్షన్ లోకి వెళ్లాలని, సుడా తరహాలో గజ్వేల్ గడలో చేయాలని జిల్లా కలెక్టర్ ను మంత్రి ఆదేశించారు. జిల్లాలోని హుస్నాబాద్, దుబ్బాక, చేర్యాలలో సైతం పరిశీలనలు చేయాలని జిల్లా కలెక్టర్ కు సూచించారు.