జిల్లాను అభివృద్ధి పదములో నిలుపుదాం: కలెక్టర్ రాజర్షి షా
మెదక్ యదార్థవాది ప్రతినిధి
జిల్లా అధికార యంత్రాంగమంతా సమిష్టిగా పనిచేసి జిల్లాను అన్ని రంగాలలో అభివృద్ధి చేద్దామని జిల్లా కలెక్టర్ రాజర్షి షా అన్నారు. ఆంగ్ల నూతన సంవత్సరాది సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్లు రమేష్ వెంకటేశ్వర్లు అదనపు జిల్లా ఎస్పీ మహేంధర్ డి ఆర్ ఓ పద్మశ్రీ జిల్లా అధికారులు కలెక్టరేట్ సిబ్బందితో కలిసి మంగళవారం జిల్లా కేంద్రంలోని కలెక్టరేట్ భవన సముదాయంలో గల కలెక్టర్ ఛాంబర్ లో జిల్లా కలెక్టర్ కు నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ సందర్భంగా జిల్లా కలెక్టర్ మాట్లాడుతూ జిల్లా అధికార యంత్రాంగం అంకితభావంతో సమిష్టిగా కృషిచేసి జిల్లా అభివృద్ధికి దోహదపడాలని అన్నారు. మునిసిపల్ చైర్మన్ చంద్రపాల్ జిల్లా టి ఎన్ జి ఓ అధ్యక్షులు నరేంధర్ జిల్లా కలెక్టర్ ను కలిసి నూతన సంవత్సర శుభాకాంక్షలు తెలిపారు. ఈ కార్యక్రమంలో పి డి డి ఆర్ డి ఓ శ్రీనివాస్ డి ఎఫ్ ఓ రవి ప్రసాద్ జిల్లా మైన్స్ & జియాలజీ శాఖ సహాయ సంచాలకులు జయరాజ్ జిల్లా షెడ్యూల్ కులాల అభివృద్ధి అధికారిణి విజయలక్ష్మి జిల్లా సంక్షేమాధికారిణి బ్రహ్మాజీ ఎక్ససైజ్ సూపరింటెండెంట్ రజాక్ జిల్లా సివిల్ సప్లై మేనేజర్ హరిబాబు డి సి ఎస్ ఓ బ్రహ్మరావు పట్టణాభివృద్ధి అధికారిణి ఇందిర ఆర్ డి ఓ జయచంద్ర రెడ్డి మునిసిపల్ కమిషనర్లు, జానకిరామ్ సాగర్ వెంకట గోపాల్ వివిధ శాఖల అధికారులు టి ఎన్ జి ఓస్ కార్యదర్శులు సంబంధిత అధికారులు జిల్లా కలెక్టరేట్ కార్యాలయ సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.