33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణలోక్ అదాల‌త్ ద్వారా సత్వర న్యాయం

లోక్ అదాల‌త్ ద్వారా సత్వర న్యాయం

లోక్ అదాల‌త్ ద్వారా సత్వర న్యాయం

జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి..

సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 14: సిద్దిపేట జిల్లా న్యాయస్థానంలో దేశ అత్యున్న‌త న్యాయ స్థానం ఆదేశాల మేర‌కు నిర్వ‌హిస్తున్న లోక్ అదాల‌త్ ల ద్వారా బాధితుల‌కు స‌త్వ‌ర న్యాయం ల‌భిస్తుంద‌నే ఉద్దేశంతో నిర్వహించడం జరుగుతుందని జిల్లా జిల్లా న్యాయమూర్తి సాయి రమాదేవి అన్నారు. శనివారం లోకదాలత్ నిర్వహించడం జరిగిందని, బాధితుల‌కు ఉచిత న్యాయ సహాయం అందించేందుకు గాను జిల్లా న్యాయ సేవాధికార సంస్థ నిత్యం ప‌ని చేస్తోంద‌ని న్యాయమూర్తి గుర్తు చేశారు. ఈ లోక్ అదాలత్ లో సివిల్, క్రిమినల్ కేసులు, భార్యభర్తల కేసులు, కుటుంబ తగాదాలు, మోటార్ వెహికల్ ఆక్సిడెంట్ కేసులు, బ్యాంకు, ఫైనాన్స్, చిట్ఫండ్ కేసులు  ఇతర కెసులలో ప్రజలు కక్షి దారులు తమ పెండింగ్ లో ఉన్న రాజీ చేసుకునే అవకాశం ఉన్న కేసులలో రాజీ కుదుర్చుకుని కేసులను సత్వరంగా రాజీ కుదుర్చుకోవాలని కోరారు, జాతీయ లోక్ అదాలత్‌లో తమ కేసులను సామరస్య పూర్వకంగా పరిష్కరించుకోవాలని అభ్యర్థించారు. లోక్ అదాలత్ లో ఎక్కువ మొత్తంలో కేసులను రాజీ కుదుర్చుకోవాలని కోరారు. ఈ లీగల్ సెల్ అథారిటీ సెక్రెటరీ స్వాతి రెడ్డి న్యాయమూర్తి, ఏసిపి మధు, లీగల్ సెల్ న్యాయవాదులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్