టీచర్ల సమస్యలన్ని పరిష్కరించాలి..
హుస్నాబాద్:యదార్థవాది ప్రతినిది
317 జివొ లోపాల వల్ల స్థానికత, సర్వీసు కోల్పోయిన ఉద్యోగులకు న్యాయం చేయాలి.
సిపిఏస్ విధానాన్ని తక్షణమే రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని వెంటనే అమలు చేయాలి.
టిచర్లను ఆవమానించిన రాష్ట్ర విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెంటనే క్షమాపణ చెప్పాలని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ తెలిపారు. ఏడ్లతరబడి కొట్లాడి సాదించుకున్న ఉద్యోగులకు న్యాయం చేయాలని 13 జిల్లాల స్పౌజ్ బాధిత ఉపాద్యయులు శనివారం హైదరాబాద్ లొ తలపెట్టిన నిరసన సంధర్భంగా ఉపాద్యయులపై అనుచిత వాక్యలు చేస్తు “మీరు టీచర్లా… రౌడీల!” అని అవమానకరంగ మాట్లాడి, బెదిరింపులకు పాల్పడిన రాష్ట్ర స్కూల్ ఎడ్యుకేషన్ డైరెక్టర్ దేవసేన ఒక గౌరవ ప్రదమైన హోదాలో ఉండి ఇలా మాట్లాడడం సరైంది కాదని, ఉన్నత మైన స్దాయిలొ ఉన్నతధికారి తమ హోదను మరిచి ఇలా మాట్లాడడం తెలంగాణలో పరిపాటిగ మారిందని మల్లెశ్ తెలిపారు. టీచర్లకు విద్యాశాఖ డైరెక్టర్ దేవసేన వెంటనే క్షమాపన చెప్పి చదువు ద్వార ఎదిగిన తమ సంస్కారాన్ని నిరూపించుకోవాలని, గత ఏడాది ప్రభుత్వం తీసుకొచ్చిన 317 జీవొ ఉన్న అనేక లోపాల వల్ల ఉద్యోగులు తమ స్థానికత,సర్వీసును కోల్పోయిన వారికి న్యాయం చేయాలని, తక్షణమే పరిష్కరించి వెంటనే సిపియస్ విధానాన్ని రద్దు చేసి పాత పెన్షన్ విధానాన్ని అమలు చేయాలని ప్రభుత్వం తలపెట్టిన ఉపాధ్యాయుల బదిలీలు, పదోన్నతులు పారదర్శకంగా నిర్వహించాలని గడిపె మల్లేశ్ తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కోరారు.