22.2 C
Hyderabad
Sunday, March 16, 2025
హోమ్తెలంగాణఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్

ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్

ఠాణా దివస్ లో సత్వరమే న్యాయం: జిల్లా ఎస్ పీ మహాజన్

-ఠాణా దివస్ సద్వినియోగం చేసుకోవాలి

-ప్రజలకు మరింత చేరువలో పోలీసులు

-సామాన్య ప్రజలకు భరోసా కల్పిస్తున్నా జిల్లా పోలీస్ యంత్రాంగం

-జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్

సిరిసిల్ల యదార్థవాది

ఇల్లంతకుంట పోలీస్ స్టేషన్ ఠాణా దివస్ లో మంగళవారం ప్రజల వద్ద 56 ఫిర్యాదులు స్వీకరించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్.. ప్రజలకు మరింత చేరువలో పోలీసులు వెళ్ళడానికి, వారి సమస్యల పరిష్కారమే లక్ష్యంగా “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి వారంలో ఒక రోజున ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించి ప్రజల వద్ద నుండి అర్జీలు స్వీకరించి అట్టి సమస్యలు పరిష్కరిస్తు ప్రజలకు భరోసా కల్పిస్తు సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులకు ఆదేశాలు జరిచేయడం జరిగిందని ఆయన అన్నారు. ఈ సందర్భంగా ఎస్పీ మాట్లాడుతూ ప్రజలకు పోలీస్ లపై నమ్మకం కలిగేలా, దివ్యాంగులు, వృద్ధులు,దూరప్రాంతల నుండి తన కార్యాలయనికి రాలేని వారి వద్దకే పోలీస్ సేవలు అందలనే ఉద్దేశ్యంతో “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని, గ్రామాల్లో ఎప్పటికప్పుడు కమ్యూనిటీ పోగ్రామ్స్ నిర్వహిస్తు ప్రజలకు అందుబాటులో ఉంటూ వారితో మమేకం అవుతూ గ్రామాలలో శాంతి భద్రతను పరిరక్షణకై కృషి చేస్తున్నామని తెలిపారు. ప్రజల నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలలు అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం అధికారులను ఆదేశించడం జరిగిందని, తమ పరిధిలో లేని సమస్యలను సంబంధిత అధికారుల దృష్టికి తీసుకవెళ్తామని, సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని, భూ తగాధాలలో క్రిమినల్ సమస్య ఉన్న ఫిర్యాదులలో FIR నమోదు చేయాలని, సివిల్ సమస్యకు సంబంధించిన పిర్యాదులను కోర్టు లో పరిష్కరించుకోవాలని దానికోసం లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పిస్తున్నామని, ఇరు వర్గాల మధ్య మధ్యవర్తిత్వం చేస్తూ సమస్యలు మేము పరిష్కరిస్తామని డబ్బులు వసూలు చేసే వారిపై మాకు ఫిర్యాదులు వస్తే చట్టపరపైన చర్యలు తీసుకోవడం జరుగుతుందని అన్నారు. శాంతి భద్రతలను కాపాడటానికి పోలీస్ శాఖ సమర్థవంతంగా విధులు నిర్వహిస్తుదని, శాంతి భద్రతల కు విఘాతం కలిగిస్తే కఠినమైన చర్యలు తప్పవని, శాంతి భద్రతలను పరిరక్షించడంలో జిల్లా పోలీస్ శాఖ కీలకంగా వ్యవహరిస్తుందని తెలిపారు. కార్యక్రమంలో సి.ఐ ఉపేందర్, ఎస్.ఐ రాజేష్ వివిధ గ్రామాల ప్రజలు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్