డిజెయు ఆంధ్ర రాష్ట్ర కమిటీ ఏర్పాటు.
విశాఖపట్నం యదార్థవాది ప్రతినిది
డెమోక్రటిక్ జర్నలిస్ట్ యూనియన్ ఆంధ్ర రాష్ట్ర కమిటీ 9మంది సభ్యులుతో నూతన కార్యవర్గన్ని ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. రాష్ట్ర కమిటీ అధ్యక్షుడుగా మరీదు ప్రసాద్ బాబు, ప్రధాన కార్యదర్శిగా హెచ్ సంజయ్ రెడ్డి ఎన్నికయ్యారు. కోశాధికారిగా ఆర్ సూర్యనారాయణ ఉపాధ్యక్షులుగా కె.చంద్రరావు డి.అప్పారావు యువిరావులు కార్యదర్శిలుగా సుంకాలు నాగేశ్వరరావు బి.శ్రీరామమూర్తి పిళ్ళా సతీష్ బాబులు ఎన్నికయ్యారు. రాష్ట్రంలోని ఆరు జిల్లాల నుంచి 70 మంది ప్రతినిధులు హాజరయ్యారు. సోమ మంగళవారం రెండు రోజులు శిక్షణ తరగతులు నిర్వహించారు. తరగతుల అనంతరం నూతనంగా రాష్ట్ర కమిటీ ఎన్నిక జిల్లాల ప్రతినిధులు ప్రజాస్వామిక పద్థతిలో నాయకత్వం ఎన్నికలు జరిగాయి. ఎన్నికల అధికారులుగా జాతీయ కో ఆర్డినేటర్ లు బిఎన్ చారి బి.మోహన్ రమేష్ కృష్ణం రాజు వ్యవహరించారు. రాబోయే రోజుల్లో యూనియన్ రాష్ట్రంలోని అన్ని జిల్లాల విస్తృతమైన ప్రచారం చేసి కమిటీలు వేయాలని తీర్మానం చేశారు అర్హులేన వివిధ సంస్ధలలో పనిచేసే జర్నలిస్ట్ అందరికి అక్రెడిటేషన్ లు ఇళ్ల స్థలాలు వైద్యం పిల్లలకు ఉచిత విద్య వైద్యం కల్పించాలని ప్రభుత్వాన్ని కోరారు జర్నలిస్టుల సమస్యలపై రాజీలేని పోరాటం నిరంతరం చేస్తుందని నూతన కమిటీ పేర్కొంది.