డిసెంబర్ 16న గడ్కోల్ లో
-ఎల్లన్న స్మారక సభను జయప్రదం చేయండి
నిజామాబాద్ రూరల్, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 8: సిపిఎంఎల్ న్యూ డెమోక్రసీ నాయకుడు పిట్ల ఎల్లన్న 34వ స్మారక సభను గడ్కోల్ గ్రామంలో 2024 డిసెంబర్ 16న నిర్వహిస్తున్నామని న్యూ డెమోక్రసీ సబ్ కార్యదర్శి బాలయ్య ఏఐకేఎంఎస్ ఆర్మూర్ డివిజన్ కార్యదర్శి మార్క్స్ తెలిపారు. ధర్పల్లి మండల కేంద్రంలోని రేకులపల్లిలో పత్రిక సమావేశం నిర్వహించారు. అనంతరం కరపత్రాలను ఆవిష్కరించారు. పేదింటిలోపుట్టిన ఎల్లన్న, శ్రమజీవుల రాజ్యం కోసం రైతు కూలీ సంఘం నాయకుడిగా అనేక పోరాటాలకు నాయకత్వం వహించారని వారు తెలిపారు. 77 ఏళ్ల స్వాతంత్ర భారతంలో పాలకులు మారిన ప్రజల బతుకులు మారడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. నరేంద్ర మోడీ ప్రభుత్వం ఎన్నికల హామీలను అమలు చేయడం విఫలం చెందిందని వారు అన్నారు. రైతు వ్యతిరేక 3 నల్ల చట్టాలను, కార్మిక వ్యతిరేక నాలుగు లేబర్ కార్డులను రద్దు చేయాలని డిమాండ్ చేశారు. రాష్ట్ర ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి పోడు భూములకు పట్టాలను ఇవ్వాలని, రుణమాఫీ మిగిలిన వారందరికీ యుద్ధ ప్రాతిపదికను జమ చేయాలని వారు విజ్ఞప్తి చేశారు. సమాజ మార్పు కోసం పోరాటమే ఎల్లన్నకు నిజమైన నివాళులు అన్నారు. ఈ సమావేశంలో ప్రజా సంఘాల నాయకులు గంగాధర్.లక్ష్మణ్.దాసు.భూమయ్య. రమేష్ తదితరులు పాల్గొన్నారు.