25.7 C
Hyderabad
Saturday, May 24, 2025
హోమ్ఆంధ్రప్రదేశ్తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

తండ్రిని కుమారులు వంతులేసుకోడం ఇష్టం లేక తనువు చాలించాడు

– తాటి పొదలతో పెట్టుకున్న మంటల్లో దూకి ఆత్మహత్య
– పొట్లపల్లి లో కాలిన గాయాలతో వృద్దిడి మృతదేహం లభ్యం

హుస్నాబాద్ యదార్థవాది

కన్న కొడుకులు పెరిగి పెద్దయ్యాక తనను కంటికి రెప్పలా కాపాడు కుంటారానుకుని కోటి ఆశలతో కొడుకులను పెంచి పెద్ద చేశాడు ఆ అమాయకపు తండ్రి. కానీ ఆ కొడుకులే తనను పోషించడానికి వంతులేసుకోవడం తో అల్లారుముద్దుగా పెంచిన మధుర అనుభూతుల జాడలు కానరాక ఇలా వంతుల పాలయ్యాననే బెంగతో ఆ తండ్రి తాను పేర్చుకున్న చితిలో దూకి తనువు చాలించాడు. ఈ రోజుల్లో మనుషుల ప్రవర్తన, కుటుంబాల్లో వృద్దులు ఏదుర్కొంటున్న విపత్కర పరిస్థితులకు నిదర్శనం యీ విషాదకర సంఘటన. వివరాలు ఇలా వున్నాయి.
వంతుల వారిగా కుమారులు ఆ తండ్రిని పోషించాలనే నిర్ణయాన్ని తండ్రి జీర్ణించుకోలేక తన సొంతూరిని వదిలి మరో ఊరికి వెళ్లడం ఇష్టం లేక, తన పోషణ తనయులకు భారం కాకూడదనుకుని ఎవరికి చెప్పకుండా ఇంటి నుండి వెళ్లిపోయి ఆత్మహతికి పాల్పడి తనువు చాలించాడు ఓ వృద్ధుడు. నెలకు ఒక కుమారుని వద్దకు వంతుల వారిగా వెళ్లడం ఇష్టం లేని వృద్ధుడు ఆత్మహత్యకి పాల్పడిన ఈ హృదయ విదారక ఘటన సిద్దిపేట జిల్లా హుస్నాబాద్ మండలం పొట్లపల్లి లో జరిగింది. పొట్లపల్లికి చెందిన మెడబోయిన వెంకటయ్య (90) కు నలుగురు కుమారులు, కుమార్తె ఉన్నారు. కుమారుల్లో ఇద్దరు పొట్లపల్లిలో ఒకరు హుస్నాబాద్ లో మరొకరు కరీంనగర్ జిల్లా చిగురుమామిడి మండలం నవాబ్ పేట లో నివసిస్తున్నారు. వెంకటయ్య భార్య గతంలోనే చనిపోయింది. తనకున్న నాలుగు ఎకరాల భూమిని కుమారులకు పంచి ఇచ్చేశాడు. కుమారులు వ్యవసాయ కూలీలుగా పనిచేస్తున్నారు. వెంకటయ్య కు వృద్ధాప్య పింఛన్ వస్తోంది. గ్రామంలోనే ఆయన పెద్ద కుమారుడు కనకయ్య వద్ద ఉండేవాడు. అయితే ఆయన పోషణ విషయంలో ఐదు నెలల క్రితం పెద్దమనుషుల సమక్షంలో పంచాయతీ జరిగింది. నెలకు ఒకరి చొప్పున నలుగురు కుమారులు వంతుల వారిగా పోషించాలని నిర్ణయించారు. గ్రామంలో ఉంటున్న పెద్ద కుమారుడు కనకయ్య వద్ద వంతు పూర్తి కావడంతో నవాబుపేటలో ఉంటున్న కుమారుడి వద్దకు వెళ్లాల్సి ఉంది. సొంత ఊరు, ఇంటిని వదిలి అక్కడికి తాను వెళ్ళనని వెంకటయ్య చెప్పేవారు. ఈనెల 2 న మంగళవారం సాయంత్రం ఇంటి నుండి బయలుదేరిన ఆయన గ్రామంలో ఓ ప్రజాప్రతినిధి ఇంటికి వెళ్లి రాత్రి అక్కడే ఉన్నారు. అక్కడ తన బాధ వెళ్లగక్కారు. 3 వ తేదీన నవాబుపేటలోని మరో కుమారుడి ఇంటికి వెళ్తానని చెప్పి అక్కడి నుండి వెళ్లిపోయారు. సాయంత్రం వరకు ఏ కుమారుడి ఇంటికి వెళ్లలేదు. అనుమానం వచ్చిన కుటుంబ సభ్యులు పరిసర ప్రాంతాలు, నవాబుపేట రోడ్డులో వెతికిన ఆచూకీ లభించలేదు. గురువారం మధ్యాహ్నం పొట్లపల్లి గ్రామంలో ఎల్లమ్మ గుట్ట వద్ద మంటల్లో కాలిన స్థితిలో వృద్ధుడి మృతదేహం కనిపించింది. ఆ మృతదేహం వెంకటయ్య దేనని కుటుంబ సభ్యులు గుర్తించారు. ఘటనా స్థలంలో తాటికమ్మలను ఒక చోట కుప్పగా వేసి వాటికి నిప్పంటించి, అందులో దూకి ఆత్మహత్యకి పాల్పడినట్లు భావిస్తున్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్