తెలంగాణ తల్లి రూపం మార్చడం పై నిరసన
బిఆర్ఎస్ పార్టీ జిల్లా నాయకులు గండూరి కృపాకర్
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 10: తెలంగాణ తల్లి రూపం మార్చడం పై ఎమ్మెల్యే, మాజీ మంత్రి గుంటకండ్ల జగదీష్ రెడ్డి ఇచ్చిన పిలుపు మేరకు జిల్లా బిఆర్ ఎస్ పార్టీ నాయకులు గండూరి క్ర్రపాకర్ ఆధ్వర్యంలో ఎంజి రోడ్ లోని తెలంగాణ తల్లి విగ్రహం వద్ద నిరసన వ్యక్తం చేశారు. అనంతరం తెలంగాణ తల్లి విగ్రహానికి పాకాభిషేకం చేశారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ తెలంగాణ ఉద్యమ సమయంలో తెలంగాణ రాష్ట్రం ఏర్పాటు తరువాత పదేళ్ల పాటు ప్రజల చే తల్లిగా పూజలు అందుకున్న తెలంగాణ తల్లి రూపం మార్చవలసిన అవసరం ఎందుకు వచ్చిందని అన్నారు. ఎక్కడైనా తల్లి రూపం మారుతుందా అని ప్రభుత్వాన్ని ప్రశ్నించారు. తెలంగాణ రాష్ట్ర పండుగ బతుకమ్మ ను లేకుండా నూతన విగ్రహం రూపొందించారని అన్నారు. ఈ కార్యక్రమంలో వార్డు సభ్యులు భిక్షం, శోభ, శారద, నాగమ్మ, స్వాతి, వెంకటేశ్వర్లు, ఇస్మాయిల్, గోపగాని పాపయ్య, తండు కృష్ణ, పోతు సాగర్, లతీఫ్, పొన్నాల ముత్తా రెడ్డి, కుక్కడపు రాములు, అనిల్, జ్యోతుల రూపేష్, మేకలప్రశాంత్, ఉల్లి రామాచారి, సిద్దిరాల భూపతి కుమార్, సందీప్, కోసల శ్రీనివాస్, పెప్సి శివన్న, కళ్యాణ్, సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు.పాల్గొన్నారు