తెలుగు జర్నలిస్టు సంక్షేమ సంఘం డైరీను ఆవిష్కరించిన ఏపీ డిజిపి
మంగళగిరి యదార్థవాది ప్రతినిధి జనవరి 29: తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం ఆధ్వర్యంలో రూపొందించిన 2025 నూతన సంవత్సర క్యాలెండర్, డైరీని బుధవారం గుంటూరు జిల్లా మంగళగిరిలోని రాష్ట్ర పోలీస్ ప్రధాన కార్యాలయంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు ఆవిష్కరించారు. అనంతరం ఆయన మాట్లాడుతూ ప్రజలకు ప్రభుత్వానికి వారధిగా ఉంటూ సమస్యలపై నిత్యం కలం ద్వారా ప్రజలను చైతన్య పరుస్తూ, అధికారులతో సమస్యల పరిష్కారానికి పాటుపడుతున్న పాత్రికేయులకు శుభాకాంక్షలు తెలియజేశారు. అనంతరం తెలుగు జర్నలిస్టుల సంక్షేమ సంఘం తరపున రాష్ట్ర డిజిపి ద్వారకా తిరుమలరావు కు సంఘం తరపున వ్యవస్థాపక అధ్యక్షులు మేడవరపు రంగనాయకులు, సంఘం సభ్యులు బింగి సత్తయ్య, కోయ రామారావు, కె.వి నారాయణ, బోడపాటి సుబ్బారావు, శివశంకర్, సాంబశివరావు సంతోషం వ్యక్తం చేశారు.