త్వరలో గ్రామాల్లోనూ ‘అన్న క్యాంటీన్లు’!
అమరావతి, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 13:
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో త్వరలో గ్రామాల్లోనూ అన్న క్యాంటీన్లు ఏర్పాటు చేయనుంది.. ఆంధ్రలో నిరుపేదలకు కడుపునిండా అన్నం పెట్టాలనే సదుద్దేశంతో అప్పటి టీడీపీ ప్రభత్వం అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసిందని తెలిసిన విషయమే.. కూటమి అధికారంలోకి రాగానే 199 అన్న క్యాంటీన్లను ప్రభుత్వం ఏర్పాటు చేసింది.. రాష్ట్రంలో ఇప్పటివరకు నగరాలు, పట్టణాలకే పరిమితమైన అన్న క్యాంటీన్లను గ్రామాల్లోనూ ఏర్పాటు చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. వచ్చే ఏడాది మార్చి నాటికి 63 చోట్ల వీటిని ప్రారంభించేందుకు కసరత్తు చేస్తోంది. జనసాంద్రత ఎక్కువగా, 40 అడుగుల రోడ్డు సదుపాయం ఉండే ప్రాంతాలను అన్వేషించాలని కూటమి ప్రభుత్వం కలెక్టర్లను ఆదేశించింది.