దళితబందా దళారుల బందా.!
-జిల్లా కాంగ్రెస్ ఎస్సి సెల్ అద్యక్షులు విజయ్..
దుబ్బాక యదార్థవాది ప్రతినిది
ముఖ్యమంత్రి కేసిఆర్ గొప్పగా చెప్పుకుంటున్న దళిత బందు పథకం నిజమైన నిరుపేద ప్రజలకు కాకుండా
బీఆర్ఎస్ నాయకులకు, కార్యకర్తలకు, దళారుల కేనా అని సిద్ధిపేట జిల్లా కాంగ్రేస్ ఎస్సీ సెల్ అధ్యక్షులు కొండపాక విజయ్ కుమార్ అన్నారు.. బుదవారం దుబ్బాక పట్టణ కేంద్రంలో ఏర్పాటు చేసిన పార్టీ కార్యకర్తల సమావేశంలో దుబ్బాక నియోజక వర్గంలోని 5 మండలాల కాంగ్రెస్ పార్టీ ఎస్సీ సెల్ అధ్యక్షులను నియమిస్తూ వారికి నియామక పత్రాలు అందచేసి, ఆయన మాట్లాడుతూ పార్టిల కు అతీతంగా దళితులు అందరికి న్యాయం జరిగేలా చూడాలని లేని పక్షంలో జిల్లాలోని అన్ని దళిత కుటుంబాలను కలుపుకొని పెద్ద ఎత్తున ఆందోళన చేపడుతామని, అందరూ కష్టపడి పనిచేయాలని, కేంద్రంలో రాష్ట్రంలో రాబోయేది కాంగ్రెస్ ప్రభుత్వమే అందుకోసం దళితులు పాత్ర క్రియాశీలకంగా ఉండబోతుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో నూతన మండల అధ్యక్షులతో పాటు సిద్దిపేట జిల్లా ఉపాధ్యక్షులు అనంతుల శ్రీనివాస్, గాంధారి నరేందర్, మంద శ్రీనివాస్, బాస మదు, అనిల్, దుర్గయ్య, రామిరెడ్డి, కర్నంపల్లి రమేష్, తదితరులు పాల్గొన్నారు.