15.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణదళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

దళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

దళిత హక్కులను కాలరాస్తున్న ప్రభుత్వాలు

యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్

కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు దళితులను విస్మరిస్తున్నాయని దళితుల మనుగడ హక్కుల కోసం దళిత పోరాట సమితిగా బలమైన పోరాటాలు చేయాలని ఆ సంఘం రాష్ట్ర నాయకుడు తాళ్లపెల్లి లక్ష్మణ్ పిలుపునిచ్చారు.. గురువారం దళిత హక్కుల పోరాట సమితి ఆధ్వర్యంలో సిద్దిపేట జిల్లా 2వ మహాసభ హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో జరిగిన కార్యక్రమంలో మాట్లాడుతూ కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఏర్పడ్డ తరువాత దళితుల సంక్షేమం కొసం పాలకులు ఏమాత్రం పట్టించుకోవడం లేదని సామాజిక భద్రత కరువైందని, దళితులకు రాజ్యాంగం కల్పించిన హక్కులు కూడా అణిచివేయలని చూస్తోందని లక్ష్మణ్ ఆందోళన వ్యక్తం చేసారు. సిద్దిపేట జిల్లా నిర్మాణ బాధ్యులు గడిపే మల్లేశ్ మాట్లాడుతూ అణగారిన కులాల హక్కులను, సంక్షేమాన్ని ప్రోత్సహిస్తున్న భారత రాజ్యాంగాన్ని కాపాడుకోవలసిన బాధ్యత ఏర్పడిందని దళితులపై అఘాయిత్యాల సంఖ్య ముఖ్యంగా బిజెపి పాలిత రాష్ట్రాల్లో ఎక్కువగా పెరుగుతున్నాయని అనేక రాష్ట్రాల్లో నేటికీ వారికి తల దాచుకునేందుకు కనిసం నివాసం ప్రాథమిక సౌకర్యాలు అందుబాటులో లేవని దళితుల సాధికారత అభివృద్ధి కోసం ఉద్యమాలు తీవ్రతరం చేయాలని ఆయన అన్నారు. దళిత హక్కుల పోరాట సమితి తెలంగాణ రాష్ట్ర ప్రధమ మహాసభలు హైదరాబాద్ లో శుక్రవారం జరుగుతాయని రాష్ట్రంలోని 33 జిల్లాలనుండి ప్రతినిధులు హాజరవుతారని దళితుల జీవన స్థితిగతులు కుల వివక్ష ఆర్థిక సామజిక భద్రత సాధికారత అభివృద్ధిపై మహాసభలలో చేర్చిస్తామని ఈ మహాసభలను జయప్రదం చేయాలని ఆయన కోరారు. అనంతరం నూతనగా జిల్లా కమిటీ ని ఎన్నుకున్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కార్యదర్శి వేల్పుల బాలమల్లు జిల్లా కార్యవర్గ సభ్యులు జాగిరి సత్యనారాయణ కనుకుంట్ల శంకర్ జిల్లా కౌన్సిల్ సభ్యులు కొమ్ముల భాస్కర్కొ య్యడ కొమురయ్య జేరిపోతుల జనార్ధన్ యాద పద్మ పిల్లి రజిని నేలవేని స్వరూప ఇరుగు సంధ్య పొన్నాల స్వరూప జనగాం రాజు కుమార్ నాయకులు సంగెం మధు బోనగిరి శంకర్ రామగళ్ల నరేష్ చిట్యాల శేఖర్ మాచర్ల శ్రీను కొమ్ముల శ్రీనివాస్ రాయికుంట శంకర్ పిట్టల మధు తదితరులు పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్