దుద్దెడ మోడల్ పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకున్న జిల్లా: కలెక్టర్
సిద్దిపేట యదార్థవాది ప్రతినిది
సిద్దిపేట జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్, జిల్లా పోలీస్ కమిషనర్ శ్వేత దుద్దెడ మోడల్ పోలింగ్ నంబర్ 91లో తమ ఓటు హక్కు వినియోగించుకున్నారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ భారత రాజ్యాంగం కల్పించిన ఓటు హక్కును జిల్లాలోని ప్రతి ఒక్కరు తమకు కేటాయించిన పోలింగ్ స్టేషన్ లో ఓటు హక్కును వినియోగించుకోవాలని సూచించారు. జిల్లాలో వంద శాతం పోలింగ్ జరగాలని లక్ష్యంగా పెట్టుకున్నామని తెలిపారు.
