దేశవ్యాప్తంగా ఉప ఎన్నికలు జరిగిన 29 అసెంబ్లీ, మూడు లోక్సభ స్థానాల్లో ఓట్ల లెక్కింపు కొనసాగుతోంది. దాద్రా నగర్ హవేలీ , మండి , ఖాండ్వా లోకసభ స్థానాలకు తాజాగా ఉప ఎన్నికలు జరుగగా అస్సాంలో 5, బెంగాల్లో నాలుగు, మధ్యప్రదేశ్లో 3, మేఘాలయాలో 3, హిమాచల్ ప్రదేశ్ లో మూడు, బీహార్లో రెండు , కర్ణాటకలో 2 , రాజస్థాన్లో 2 అసెంబ్లీ స్థానాల్లో బై ఎలక్షన్ జరిగింది. ఇక తెలంగాణ, ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, హర్యానా, మిజోరం లలో ఒక్క స్థానానికి ఉప ఎన్నిక జరిగింది