28.2 C
Hyderabad
Tuesday, April 22, 2025
హోమ్తెలంగాణధనానికి ఇం"ధనం" కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్

ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్

ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కే: మంత్రి హరీష్

-రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్మిక భవన్ మంజూర్.!

-కార్మికులకు లక్షన్నర నుండి రూ.3 లక్షలకు భీమా పెంపు.

-5లక్షల వరకూ ఆరోగ్య శ్రీ వైద్య సేవలు.

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

ఏ ప్రగతికైనా మూల ఆధారం కార్మికుడే.. ప్రభుత్వం అయినా ప్రైవేట్ అయినా నడిచేది కార్మికుడి కష్టం మీదే.. సంపాదించే ధనానికి ఇం”ధనం” కార్మికుడి చెమట చుక్కేనని రాష్ట్ర ఆర్థిక, ఆరోగ్య శాఖ మంత్రి హరీశ్ అన్నారు..జిల్లా కేంద్రమైన సిద్ధిపేట కొండా భూదేవి గార్డెన్ లో ఆదివారం జిల్లా అధ్యక్షుడు శ్రీశైలం అధ్యక్షతన, రాష్ట్రంలోని వివిధ జిల్లాల నుంచి వచ్చిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో మంత్రి హాజరై మాట్లాడుతూ ప్రతీ భవన నిర్మాణ కార్మికుడు కార్డు కలిగి ఉండాలని, అందుకు అవసరమైన డబ్బులు తానే వెచ్చిస్తున్నట్లు, కార్డు ఉంటేనే మీరు లబ్ధి పొందే అవకాశం ఉన్నదని, ప్రతి కార్మికులు రిజిస్ట్రేషన్ చేయించుకుని కార్డు పొందాలని, ఇందు కోసం క్యాంపు కార్యాలయంలో కౌంటర్ ఏర్పాటు చేసినట్లు, అవసరమైతే మీ అనువైన సమయం అమావాస్య రోజున ఐదు కౌంటర్లు ఏర్పాటు చేయిస్తానని తెలిపారు. ఆరోగ్యం పై శ్రద్ధ తీసుకోవాలని కుటుంబం బరువు బాధ్యత మీపై ఆధారపడి ఉన్న సంగతి మరువొద్దని, నిత్యం శ్రమించి రాత్రిపూట దూపకు అలవాటు కావొద్దని, తక్కువ చేస్తూ మీ ఆరోగ్యం కాపాడుకోవాలని కార్మికులకు మంత్రి ఆరోగ్య సూత్రాలు తెలిపారు.. రైతుభీమా తరహాలో కార్మిక భీమా చేయాలని నిర్ణయించినట్లు మంత్రి ప్రకటించారు. డిజిటల్ కార్డుల రూపకల్పనకు స్పెషల్ డ్రైవ్ చేపడుతామని తెలిపారు. ఈ మేరకు అప్పటికప్పుడే కార్మిక శాఖ మంత్రి మల్లారెడ్డి, కమిషనర్ రాణి కౌముదితో చర్చించారు. మార్గదర్శకాలకు అనుగుణంగా ఓ ఏజెన్సీ ద్వారా సభ్యత్వం పొందిన కార్మికుడి వేలిముద్ర సేకరించి, నామిని వివరాలు నమోదు చేయాల్సి ఉంటుందని, దాంతో సమగ్రమైన సమాచారం కలిగి ఉండటంతో అర్హులైన మీకు ప్రభుత్వం నుంచి వచ్చే సంక్షేమ ఫలం అందుతుందని అవగాహన కల్పించారు. ఒక్కసారి డిజిటల్ కార్డు చేసుకుంటే ఐదేళ్ల వరకే పరిమితం అయిందని, తిరిగి రెన్యూవల్ బాధలకు మీరు పడుతున్న బాధలు గుర్తించి ఇప్పుడు ప్రభుత్వం పదేళ్లకు పెంచిందని ఇది వరకూ లక్షన్నర ఉన్న భవన నిర్మాణ కార్మికుడి భీమా ఇక నుంచి రూ.3 లక్షలకు పెంపునకు సీఎం కేసీఆర్ చర్చించి కృషి చేస్తానని మంత్రి హరీశ్ హామీనిచ్చారు.. ఇటీవల కార్మిక-ఆరోగ్య శాఖ కార్మికుడి వైద్య సేవలపై చర్చించి ఒప్పందం కుదుర్చుకుందని, రూ.5లక్షల వరకూ ఉచితంగా ఆరోగ్య శ్రీ వైద్య సేవలు ప్రభుత్వ, ప్రైవేట్ ఆసుపత్రుల్లో వర్తించేలా చర్యలు ఉంటాయని మంత్రి హరీశ్ వెల్లడించారు. అలాగే క్యాన్సర్, గుండె చికిత్సలకు రూ.10 లక్షల వరకూ ఆరోగ్య భీమా వర్తించేలా ఈ ఆగస్టు నెల నుంచి అమలు కాబోతున్నదని తెలిపారు. సిద్ధిపేట శివారు మందపల్లిలో కార్మిక భవన్ నిర్మాణం కోసం ఎకరం స్థలాన్ని కేటాయిస్తున్నట్లు మంత్రి ప్రకటించారు. సిద్ధిపేటలో ఎల్అండ్ టీ, సెట్విన్, యూనియన్ బ్యాంకు ఆఫ్ ఇండియా శిక్షణ కేంద్రం, న్యాక్ శిక్షణ కేంద్రాలు ఉన్నాయని, వాటి ద్వారా మీలో నైపుణ్యాలను పెంచుకోవచ్చునని, ఆయా శిక్షణ కేంద్రాల్లో వెళ్లేలా మీ పిల్లలను ప్రోత్సహించాలని, ఆ శిక్షణ కేంద్రాలను సద్వినియోగం చేసుకోవాలని అన్నారు.. సిద్ధిపేటలో జరిగిన భవన నిర్మాణ కార్మికుల బహిరంగ సభలో ఆసక్తికరంగా ఫోను లైనులో కార్మిక మంత్రి మల్లారెడ్డి, ఆరోగ్య మంత్రి హరీశ్ సంభాషణ జరిపారు. ఈ మేరకు కార్మికులను ఉద్దేశించి కష్టపడ్డ, పాలు అమ్మిన, పూలు అమ్మిన, ఎమ్మెల్యేగా, మీ కార్మిక మంత్రిగా ఇవాళ మీతో మాట్లాడుతున్నానని సభలో కార్మికులందరినీ ఉత్సాహపరిచారు.. మంత్రి హరీశ్ కోరిక మేరకు సిద్ధిపేట జిల్లాతో పాటు రాష్ట్రంలోని అన్ని జిల్లాలకు కార్మిక భవన్ మంజూర్ చేస్తానని తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్