నకిలీ విత్తనాలు అమ్మితే కఠిన చర్యలు..
గజ్వేల్ యదార్థవాది
గజ్వేల్ వ్యవసాయ డివిజన్ పరిదిలోని గజ్వేల్ కోండపాక రాయిపోల్ మండలాల ఎరువులు విత్తనాల డీలర్లతో గురువారం వ్యవసాయ శాఖ అధికారులు సమావేశం నిర్వహించరు. సమావేశానికి సిద్దిపేట జిల్లా వ్యవసాయ శాఖ అధికారి శివ ప్రసాద్ హాజరై పలు సూచనలు ఇవ్వడం జరిగింది. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ లైసన్స్ కల్గిన కంపనీల విత్తనాలు, ఎరువులు, పురుగుల మందులను మాత్రమే అమ్మాలని సూచించడం జరిగింది. విత్తనాల, ఎరువుల ధరల పట్టిక షాపుల మందర రైతులకు అందుబాటులో ఉంచాలని తెలిపారు.రైతులకు సరుకులు కొన్న వేంటనే రశీదు తప్పని సరిగా ఇవ్వాలన్నారు. నఖిలి విత్తనాలు అమ్మితే పిడి చట్టం ద్వార కేసులు నమోదు చేసి చర్యలు తీసుకుంటామని అన్నారు. అధిక ధరలకు విత్తనాలను, ఎరువులను అమ్మితే కేసులు నమోదు చేయడం జరుగుతుందన్నారు.స్టాకు రిజిష్టరు తప్పనిసరిగ రాయాలన్నారు.కాలం చేల్లిన విత్తనాలు అమ్మితే చట్టం ప్రకారం శిక్షించబడతారన్నారు.ఈ కార్యక్రమంలో గజ్వేల్ ఎడిఎ బాబు నాయక్,ఎఓ నాగరాజు,ఎఓ ప్రియదర్శిని,ఎఓ నాగేందర్,ఎఓ వసంత్,డీలర్లు పాల్గొన్నారు.