30.2 C
Hyderabad
Friday, May 23, 2025
హోమ్తెలంగాణనర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన

నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన

నర్సాపూర్ నియోజకవర్గంలో మంత్రి కొండ సురేఖ పర్యటన

వెల్దుర్తి /మాసాయిపేట, యదార్థవాది, డిసెంబర్ 13:

మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజక వర్గంలో పర్యటించ నున్న అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖ జిల్లా ఇన్చార్జ్ మంత్రివర్యులు కొండ సురేఖ  విచ్చేస్తున్నారని పిసిసి ప్రధాన కార్యదర్శి, నర్సాపూర్ నియోజకవర్గ ఇన్చార్జి ఆవుల రాజిరెడ్డి తెలిపారు. శుక్రవారం మాట్లాడుతూ మంత్రి కొండా సురేఖ  శనివారం ఉదయం 10:00 గంటలకు నర్సాపూర్ లోని అర్బన్ పార్క్ ను సందర్శిస్తారని, అనంతరం 12:00 గంటలకు హత్నూర మండల కేంద్రంలోని డాక్టర్ బి.ఆర్ అంబేద్కర్ సాంఘిక సంక్షేమ బాయ్స్ హాస్టల్ ను సందర్శించి విద్యార్థులతో కలిసి భోజనం చేస్తారని ఆవుల రాజిరెడ్డి  తెలిపారు. నర్సాపూర్ నియోజకవర్గ కాంగ్రెస్ పార్టీ నాయకులు, కార్యకర్తలు కాంగ్రెస్ పార్టీ అన్ని అనుబంధ సంఘాల నాయకులు, కార్యకర్తలు తదితరులు ఉదయం 9 గంటలకు అర్బన్ పార్క్ వద్దకు చేరుకోవాలని ఆయన పత్రిక ప్రకటనలో తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్