నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటా
-నాయి బ్రాహ్మణ కులస్తులకు పెద్దపీట వేసిన కేసీఆర్
-సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్
సంగారెడ్డి యదార్థవాది ప్రతినిధి
నాయి బ్రాహ్మణులకు అండగా ఉంటానని తెలంగాణ రాష్ట్రంలో నాయి బ్రాహ్మణ కులస్తులకు మాజీ సీఎం కేసీఆర్ ప్రభుత్వం అన్ని రకాలుగా ఆదుకుని వారికి ఆర్థికంగా ఎదగడానికి కృషి చేసిందని బీఆర్ఎస్ సంగారెడ్డి ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ అన్నారు. సోమవారం సదాశివపేట పట్టణంలోని చింతా ప్రభాకర్ క్యాంప్ కార్యాలయంలో సంగారెడ్డి ఎమ్మెల్యేగా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా చింతా ప్రభాకర్ కు నాయి బ్రాహ్మణ సేవా సంఘం ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే చింతా మాట్లాడుతూ నాయి బ్రాహ్మణ సంఘస్తులు అన్ని విధాలుగా అండగా నిలిచి ప్రజలకు ఎంతో సేవ చేస్తున్నారనీ, దైవభక్తితో పాటు, సేవా గుణం ఉన్న గొప్ప వ్యక్తిత్వం గల వారు నాయి బ్రాహ్మణులు అని కొనియాడారు. వారి అభివృద్ధి కొరకు గత ప్రభుత్వం ఎంతో కృషి చేసిందని, ఏ పార్టీలు కూడా నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పించలేదని బీఆర్ఎస్ పార్టీ మాత్రం నాయి బ్రాహ్మణులకు ప్రాధాన్యత కల్పిస్తూ 250 యూనిట్లు కరెంటు ఉచితంగా ఇస్తామని ఎన్నికల్లో చెప్పడం జరిగిందినీ చెప్పిన మాట ప్రకారం ప్రతి నాయి బ్రాహ్మణ షాపులో ప్రతి ఒక్కరికి 250 యూనిట్ల ఉచిత కరెంటును అందించామని అన్నారు. అసెంబ్లీ ఎన్నికల్లో కారు గుర్తుకు ఓటు వేసి తనను భారీ మెజారిటీతో గెలిపించారని ఆయన ఈ సందర్భంగా గుర్తుచేశారు. ఈ కార్యక్రమంలో సంగారెడ్డి నాయి బ్రాహ్మణ సేవా సంఘం అధ్యక్షులు లకుడారం మాణిక్ ప్రభు మామిళ్ళ నాగభూషణం దత్తాత్రేయ శేఖర్ వీరభద్ర అంజయ్య సత్యం చేర్యాల ఆంజనేయులు వీరన్న గోపాల్ నాయి బ్రాహ్మణ యువజన సంఘం అధ్యక్షులు చరణ్ శ్రీశైలం రాము రాజు సాయి ప్రసాద్ తదితరులు పాల్గొన్నారు.