నిర్లక్ష్యంగా పాఠశాల బస్సును నడిపిన డ్రైవర్
* తప్పిన పెను ప్రమాదం
* ఆర్టిఏ అధికారులు పాఠశాల బస్సులను పర్యవేక్షించాలి
యదార్థవాది ప్రతినిధి హుస్నాబాద్
స్కూల్ బస్ డ్రైవర్ నిర్లక్ష్యంగా బస్ ను నడపడంతో పాఠశాల విద్యార్థులకు పెను ప్రమాదం తప్పింన సంఘటన సిద్దిపేట జిల్లా కోహెడ మండలంలో సోమవారం జరిగింది. 50 మంది విద్యార్థులతో కూడిన ప్రైవేటు పాఠశాల బస్సు అధుపు తప్పి చెట్టుకు ఢీకొట్టి ఆగిపోయింది. లేదంటే పక్కనే ఉన్న బావిలో పడితే ఘోర ప్రమాదం జరిగేది. వివరాల్లోకి వెళితే ప్రైవేట్ పాఠశాల అయిన సెయింట్ విన్సెంట్ పల్లోటి పాఠశాలకు చెందిన బస్సు విద్యార్థులతో ఉండగా అదుపుతప్పి చెట్టును ఢీకొట్టింది.. పక్కనే వ్యవసాయ బావి యుండగా చెట్టు అడ్డుగా లేనట్లయితే బావిలోకి వెళ్లి పెను ప్రమాదం జరిగి ఉండేది.. కాగా గతంలో లో కూడా ఇదే పాఠశాలకు చెందిన ఇదే బస్సు ఇదే డ్రైవర్ తో ఒక కారును ఢీకొట్టిన సంఘటన కూడా ఉంది.. బస్సుకు చెందిన డ్రైవర్ నిర్లక్ష్య పూరిత డ్రైవింగ్ చేస్తాడని స్థానికులు చెబుతున్నారు. ఆర్టిఏ అధికారులు పాఠశాల వాహనాలను డ్రైవర్లను పర్యవేక్షించాల్సిన అవసరం ఉంది.