నీతి సూర్యుడు ప్రార్ధన మందిరంలో సెమీ క్రిస్మస్
50 మంది వృద్ధులకు దుప్పట్ల పంపిణి
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 12:
ఆత్మకూర్ ( యస్ ) మండల కేంద్రం ఏపూర్ గ్రామం లో నీతి సూర్యుడు ప్రార్ధన మందిరం వ్యవస్థాపకులు రెవ డా పంది మార్కు దీవెనమ్మ ఆధ్వర్యంలో ఘనంగా సెమీ క్రిస్మస్ నిర్వహించడం జరిగింది. ఈ కార్యక్రమానికి ముఖ్య ప్రసంగికులు రెవ. డా. పి. జాన్ మార్కు, బిషప్ దుర్గం ప్రభాకర్, రజ్జి డేవిడు లు పాల్గొని క్రీస్తూ బోధనలు ప్రవచనాలు తెలిపారు. అనంతరం వారికీ సన్మానం చేసి వారి చేతుల మీదుగా 50 మంది పేద వితంతు వృద్ధ మహిళ లకు దుప్పట్లు పంపినీ చేసి 200 మంది క్రైస్తవ భక్తులకు ప్రేమ విందు ఏర్పాటు చేశారు. ఈ కార్యక్రమంలో నియోజకవర్గ అధ్యక్షులు రెవ. డా. జలగం జేమ్స్, రూరల్ వర్కింగ్ ప్రెసిడెంట్ రెవ. ఏర్పుల క్రిస్టోఫర్, పాస్టర్ యడవెల్లి అబ్రాహాము, రెవ. చెట్టుపల్లి కిరణ్ కుమార్ తదితరులు పాల్గొన్నారు