నూతన టెక్నాలజీని అందిపుచ్చుకోవాలి: పోలీస్ కమిషనర్
సిద్ధిపేట యదార్థవాది
పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత గజ్వేల్ డివిజన్ పోలీస్ అధికారులతో బుధవారం కమిషనర్ కార్యాలయంలో పెండింగ్ కేసులపై సమీక్షా సమావేశం నిర్వహించారు. పెండింగ్ ఉన్న (అండర్ ఇన్వెస్టిగేషన్) కేసులలో గ్రేవ్, నాను గ్రేవ్ కేసుల వివరాలను ఎసిపి, సిఐలను, ఎస్ఐలను అడిగి తెలుసుకొన్నారు.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ 2022 సంవత్సరం లో పెండింగ్ ఉన్న కేసులు త్వరగా డిస్పోజల్ చేయాలని మిస్సింగ్ కేసులను అన్ని కోణాల్లో ఇన్వెస్టిగేషన్ చేసి ట్రేస్ అవుట్ చేయాలని సూచించారు. పెండింగ్ నాన్ బేలబుల్ వారెంట్స్ పై రివ్యూ నిర్వహించి వారి యొక్క అడ్రస్ కనుక్కొని ఎగ్జిక్యూటివ్ చేయాలని
ప్రతి కేసులో క్వాలిటీ ఇన్వెస్టిగేషన్ ఉండాలి, రౌడీలు, కేడీలు, సస్పెక్ట్ ల యొక్క కదలికలపై నిరంతరం నిఘాపెట్టాలని తెలిపారు. కేసుల్లో శిక్షల శాతం పెంచాలని నూతన టెక్నాలజీని పోలిస్ సిబ్బంది అందిపుచ్చుకోవాలని ఎస్సీ ఎస్టీ, ఫోక్సో, క్రైమ్ అగ్నిస్ట్ ఉమెన్, కేసులలో 60 రోజుల లోపు ఇన్వెస్టిగేషన్ పూర్తి చేసి తప్పకుండా కోర్టులో చార్జిషీట్ దాఖలు చేయాలని ఆదేశించారు.. పాత రౌడీలు కేడీలపై నిరంతరం నిఘాపెట్టాలి. దొంగతనాల కేసుల్లో ప్రతిరోజు కేసు చేతన గురించి అన్ని కోణాల్లో ప్లాన్ ఆఫ్ యాక్షన్, ఎస్ఓపి ప్రకారం ఇన్వెస్టిగేషన్ చేసి కేసులు ఛేదించాలని సూచించారు. ప్రతిరోజు ఉదయం సాయంత్రం విజబుల్ పోలీసింగ్ లో భాగంగా వాహనాల తనిఖీలు నిర్వహించాలని రాత్రి పెట్రోలింగ్ అధికారులు లాడ్జిలు పాత నేరస్తులను తనిఖీ చేయాలని తెలిపారు. బహిరంగ ప్రదేశాల్లో మద్యం సేవించే వారిపై కేసులు నమోదు చేయాలని సూచించారు. సైబర్ నేరాల నియంత్రణ గంజాయి, డ్రగ్స్ సమూలంగా నిర్మూలించడానికి ప్రతి గ్రామాలలో పట్టణాలలో ప్రజలకు ప్రజాప్రతినిధులకు యువకులకు గ్రామాల విపిఓలు, పోలీస్ అధికారులు, సిబ్బంది అవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని తెలిపారు.. ఈఎంఆర్ఐ ఫస్ట్ రెస్పాండెంట్ ప్రధమ చికిత్స, సిపిఆర్ ఏఈడి గజ్వేల్ డివిజన్ లో శిక్షణ పొందిన 93 మంది పోలీస్ సిబ్బంది, గజ్వేల్ డివిజన్ లో వివిధ ప్రాంతాల నుంచి వచ్చిన 103 మంది యువతకు/వాలంటీర్లకు సర్టిఫికెట్లు అందజేసిన కమిషనర్. సమావేశంలో గజ్వేల్ ఎసిపి రమేష్, గజ్వేల్ సిఐ వీరాప్రసాద్, రూరల్ సీఐ రాజశేఖర్ రెడ్డి, తొగుట సిఐ కమలాకర్, గజ్వేల్ ట్రాఫిక్ సిఐ తిరుపతి, సిసిఆర్బి ఇన్స్పెక్టర్ గురుస్వామి, గజ్వేల్ డివిజన్ ఎస్ఐలు రంగకృష్ణ, కృష్ణమూర్తి, హరీష్, కరుణాకర్ రెడ్డి, మహబూబ్, చైతన్య రెడ్డి, అరుణ్, సీసీఆర్బి, ఐటీకోర్ టీం సిబ్బంది తదితరులు పాల్గొన్నారు.
