నేడు మంత్రుల పర్యటన
పలు శంకుస్థానలు, అభివృద్ధి కార్యక్రమాలకు ప్రారంభోత్సవం..
హుస్నాబాద్ యదార్థవాది
రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభవృద్ధి కార్యక్రమాలలో పాల్గొంటారు.. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, రెండు పడకల ఇండ్లు, టిటిసి బిల్డింగ్, బస్తిధవాఖాన, గవర్నమెంటు డిగ్రీ కళాశాల, మునిసిపల్ ఆపిస్ కాంప్లెక్స్, ఎస్టి మహీళల వసతి గృహాల ప్రారంభోత్సవాలు, ఎసిపి కార్యలయం, ఎల్లమ్మ ట్యాంక్ సుందరీకరణ శంకుస్థాపనలు చేయనున్నారు. కార్యక్రమంలో ప్రణాళిక సంఘ చైర్మన్ వినోద్ కుమార్ స్థానిక శాసనసభ్యులు సతీష్ కుమార్ తదితరులు పాల్గొననున్నారు.