నేడు మంత్రుల పర్యటన
ముందస్తుగా సిపిఐ నేతల అరెస్ట్
హుస్నాబాద్ యదార్థవాది
రాష్ట్ర మంత్రులు కల్వకుంట్ల తారక రామారావు ఎర్రబెల్లి దయాకర్ రావు నేడు సిద్ధిపేట జిల్లా హుస్నాబాద్ లో పలు అభవృద్ధి కార్యక్రమాలలో పాల్గొనేందుకు వస్తున్న నేపథ్యంలో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తుగా సిపిఐ నేతలను అరెస్ట్ చేశారు. హుస్నాబాద్ పట్టణంలో ఇండోర్ స్టేడియం, రెండు పడకల ఇండ్లు, టిటిసి బిల్డింగ్, బస్తిధవాఖాన, గవర్నమెంటు డిగ్రీ కళాశాల, మునిసిపల్ ఆపిస్ కాంప్లెక్స్, ఎస్టి మహీళల వసతి గృహాల ప్రారంభోత్సవాలకు మంత్రులు వస్తున్నారు. అయితే రెండు పడకల ఇండ్ల పంపిణీ లో అవతవకలు జరిగాయని, అనర్హులకు కూడా డబుల్ బెడ్రూం ఇండ్లు కేటాయించారని, అర్హులకే డబుల్ బెడ్రూం ఇండ్లు ఇవ్వాలంటూ సిపిఐ నేతలు మంత్రులను అడ్డుకొనున్నారాన్న సమాచారం మేరకు వారిని అరెస్ట్ చేశారు.
ఆధునిక సాంకేతికత పరిజ్ఞానంతో అరెస్ట్..
కేటిఆర్ పర్యాటన సందర్భంగా సిపిఐ నాయకులు ఎక్కడున్నారో వారు వాడుతున్న సెల్ ఫోన్ సిగ్నల్ ద్వారా కొండాపూర్ వద్ద సిపిఐ నేతలను
అక్కన్నపెట ఎస్ఐ నేతృత్వం లోని పోలీస్ బృందాలు ఉదయం 6 గంటలకు అరెస్ట్ చేశారు.అరెస్ట్ అయిన వారిలో సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ ఉన్నారు. అనంతరం వీరిని హుస్నాబాద్ పోలీస్ స్టేషన్ నుండి అక్కన్నపెట పొలిస్ స్టేషన్ కు తరలించారు.