నేరస్థులకు శిక్ష పడేలా కృషి చేయాలి : జిల్లా ఎస్ పి
యదార్థవాది ప్రదినిది సిరిసిల్ల
కోర్టు కేసుల్లో నేరస్తులకు శిక్ష పడేలా చేయడం శిక్షల శాతాన్ని పెంచడం ద్వారా సమాజంలో మంచి మార్పు తీసుకురావచ్చని జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్ తెలిపారు.. శుక్రవారం జిల్లా పోలీస్ కార్యాలయంలో కోర్ట్ విధులు నిర్వహించే పోలీస్ అధికారులతో సమావేశంలో సమావేశంలో ఆయన మాట్లాడుతూ న్యాయాధికారులతో ఎల్లప్పుడూ సమన్వయం పాటిస్తూ నేరస్థులకు శిక్ష పడేవిధంగా కృషి చేయాలని నిరంతరం పెండింగ్లో ఉన్న కేసుల పురోగతిని పరిశీలిస్తూ పై అధిారుల సూచనలు పాటిస్తూ కేసుల పరిష్కారానికి కృషి చేయాలని అన్నారు. సాంకేతికత ప్రస్తుతం కీలకంగా మారిందని ప్రతి కేసులో సైంటిఫిక్ ఆధారాలు జమ చేయాలని ప్రధాన కేసుల్లో నిందితులకు జీవిత ఖైదుపడేలా కృషి చేయాలని శిక్షల శాతం పెరిగేలా పనిచేసే అధికారులను రివార్డులు ఇవ్వడం జరుగుతుందని అన్నారు. ప్రాసిక్యూషన్ లో భాగంగా కోర్ట్ జారీ చేసిన నాన్ బేలబుల్ వారెంటులను క్రమం తప్పకుండా అమలుచేయాలని సూచించారు. సమావేశంలో సర్కిల్ ఇన్స్పెక్టర్ కిరణ్ కుమార్ కోర్ట్ డ్యూటీ అధికారులు పాల్గొన్నారు.