నేరాల పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలి: డిప్యూటీ పోలీస్ కమిషనర్
-మట్కా నిర్వహిస్తున్న వారిపై కేసులు నమోదు.
-బెల్టు షాపులు నిర్వహిస్తున్న వారిపై కేసులు.
నిజామాబాద్ యదార్థవాది ప్రతినిధి
నిజామాబాద్ పోలీస్ కమిషనరేట్ 6వ పట్టణ పోలీస్ స్టేషన్ పరిధిలో శుక్రవారం కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహించిన అదనపు డిప్యూటీ పోలీస్ కమీషనర్ ఎస్. జయారామ్ ఈ సందర్భంగా వారు మీడియాతో మాట్లాడుతూ 6వ పట్టణ పరిధిలో నేరాల నియంత్రణలో భాగంగా ముందు జాగ్రత్తగా ప్రజలతో సత్సంబందాల కోసం కమ్యూనిటి కాన్ టాక్టు ప్రోగ్రామ్ నిర్వహిస్తున్నామని, అందులో భాగంగా ప్రతి వాహనాదారుల వాహనాల డాక్యూమెంట్లు పరిశీలించామని, ప్రతి వాహనదారుడు హెల్మెట్ ధరించాలని, సైబర్ క్రైమ్ పట్ల జాగ్రత్తలు తీసుకోవాలని, సైబర్ నేరాలు చేసే వారి ఊచ్చులో పడకూడదని, ఆన్లైన్ చెల్లింపుల విషయంలో జాగ్రత్తలు పాటించాలని బ్యాంక్ నుండి మాట్లాడుతున్నామనీ మన బ్యాంక్ సమాచారం అడిగిన ఎవ్వరికి ఇవ్వరాదని, లక్కీడ్రా పేరుతో ఎవ్వరికి డబ్బు లు ఇవ్వరాదని, ఆ సాంఘిక కార్యక్రమాలకు అందరూ దూరంగా ఉండాలని ఎవరికైన దృష్టిలోకి వచ్చినట్టయితే స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయాలని, డయల్ 100 లేదా 1930 కు సంప్రదించాలని, పట్టణ పరిధిలో మట్కా నిర్వహిస్తున్న అబ్దుల్ సాజీద్, సయ్యద్ షాదుల్లా లపై, రెండు బెల్ట్ షాపులపై దాడి చేసి 248 లిక్కర్ బాటిల్స్ స్వాదీనం చేసుకొని వారిపై కేసులునమోదు చేయడం జరిగిందని తెలిపారు. ప్రతి ఒక్కరు వారి వారి పరిధిలో సి.సి కెమెరాలను ఏర్పాటు చేసుకోవడానికి ఈ సి.సి కెమెరాల ఏర్పాటు వలన నేరగాళ్ల గుట్టురట్టులో ఎంతో దోహాదపడుతున్నాయని అన్నారు. ఈ తనికిలో నిజామాబాద్ ఎ.సి.పి కిరణ్ కుమార్, 8మంది సర్కిల్ ఇన్స్పెక్టర్స్, సబ్ ఇన్స్పెక్టర్స్, నేహ్రు నగర్, రాంనగర్ సర్పంచులు అమానుల్లా, జిలానీ, ఎమ్.పి.టి.సి స్వామి కాలనీ వాసులు పాల్గొన్నారు.