న్యాయన్ని కాపాడే న్యాయ వాదులకే రక్షణ లేదా..
యదార్థవాది ప్రతినిది నిజామాబాద్
న్యాయవాది పై పోలీసుల దాడిని ఖండిస్తూ నిజమాబాద్ జిల్లా కోర్ట్ ఎదురుగా న్యాయవాదూలకు సంఘిభావం తెలిపిన వైఎస్ఆర్ తెలంగాణ పార్టీ అర్బన్ అసెంబ్లీ నియోజకవర్గ కో ఆర్డినేటర్ బుస్సాపూర్ శంకర్.. ఈ సందర్బంగా ఆయన మాట్లాడుతూ న్యాయన్ని కాపాడే న్యాయవాదులకే ఈ ప్రభుత్వంలో రక్షణ లేకుంటే ఇంకా ఎవరికి రక్షణ ఉంటుందని ప్రశ్నించారు. ఇటువంటి చర్యలు పునరావృతం కాకుండా చూడాల్సిన భాద్యత ప్రభుత్వానిదేనని యువ న్యాయవాదులకు న్యాయం జరిగే వరకు వైఎస్ఆర్ పార్టీ తోడుగా ఉంటుందని తెలిపారు. కార్యక్రమంలో జిల్లా పార్టి నాయకులు మోహన్ నాయక్అం కార్ గణేష్ కారంపూరి రవి కుమార్ సన్నిథ్ గౌడ్ శ్రీశాంత్ తదితరులు పాల్గొన్నారు.