పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలి సిపిఎం పార్టీ డిమాండ్..
యదార్థవాది ప్రతినిది చేర్యాల
చేర్యాల మండలంలోని పోతిరెడ్డిపల్లి గ్రామంలో పంచాయతీ కార్యదర్శి నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని సిపిఎం పార్టీ మండల కమిటీ సభ్యుడు కత్తుల భాస్కర్ రెడ్డి సీనియర్ అసిస్టెంట్ కు వినతి పత్రం అందజేశారు ఈ సందర్భంగా అయన మాట్లాడుతూ పంచాయతీ కార్యదర్శి వీధి దీపాల విషయంలో నిర్లక్ష్యంగా వ్యవహరిస్తుందని ఉదయం 8 నుంచి 10 గంటల వరకు గ్రామంలో వీధి దీపాలు వెలుగుతున్నాయని అన్నారు అంతేగాక ఇప్పటికి నేను 12 సార్లు ఫోన్ చేసి చెప్పడం జరిగింది అయినప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని కత్తుల భాస్కర్ రెడ్డి డిమాండ్ చేశారు అంతేగాక ఒక నెల జీతం గ్రామపంచాయతీకి కరెంట్ బిల్లు ఖాతాలో జమ చేయాలని అన్నారు. ఆన్ ఆప్ ఉన్నప్పటికీ నిర్లక్ష్యంగా వ్యవహరించడం వల్ల ఈ భారం గ్రామ ప్రజలపై పడుతుందని ఆవేదన వ్యక్తం చేశారు ఇకనైనా ఉన్నతాధికారులు స్పందించి విచారణ చేపట్టి పంచాయతీ కార్యదర్శి పై చట్టపరమైన చర్యలు తీసుకోవడంతో పాటు ఒక నెల జీతం గ్రామపంచాయతీలో కరెంటు బిల్లులకు జమ చేయాలని అన్నారు ఈ కార్యక్రమంలో మండల కమిటీ సభ్యుడు పోనుగంటి శ్రీనివాస్ రెడ్డి శాఖ కార్యదర్శి గర్నపల్లి చంద్రం కత్తుల నరసింహారెడ్డి తదితరులు పాల్గొన్నారు