పంజాబ్ ను తలదన్నేల తెలంగాణ రైతుల వ్యవస్థ: మాజీ మంత్రి పెద్దిరెడ్డి.
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
హుస్నాబాద్ నియోజకవర్గంలోని కోహెడ మండలం పలు గ్రామాలలో టిఆర్ఎస్ పార్టీ అభ్యర్థి స్థానిక ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్, మాజీ మంత్రి ఇనుగాల పెద్దిరెడ్డి ప్రచారాన్ని చేశారు ఈ సందర్భంగా పలు గ్రామాల మహిళలు ఆశీర్వాదం తెలిపారు.. ఈ సందర్భంగా బీ అర్ ఎస్ అభ్యర్థి సతీష్ మాట్లాడుతూ గ్యారెంటీ లేని పార్టీ కాంగ్రెస్, అభ్యర్థులు లేని పార్టీ బిజెపి అని ప్రజలను మభ్యపెట్టిందుకే ఆరు గ్యారెంటీలు, బిసి ముఖ్యమంత్రి అని వస్తున్నారని ఇలాంటి మాటలతో మన బ్రతుకులు ఆగం చేసుకోవద్దని అభివృద్ధిని చూసి ఓటు వేయాలని ఆయన తెలిపారు. మాజీ మంత్రి మాట్లాడుతూ రానున్న రోజులలో మన తెలంగాణ దేశానికి ఆదర్శంగా నిలుస్తుందని ఇప్పటికే కేంద్ర, ఇతర రాష్ట్రాలు, తెలంగాణలో ఉన్న సంక్షేమ పథకాలను కాపీ కొట్టిందని, ఇది మన ముఖ్యమంత్రి కెసిఆర్ కే దక్కుతుందని, వచ్చే ఎన్నికలలో కెసిఆర్ ముచ్చటగా మూడోసారి ముఖ్యమంత్రి కావడం, సౌమ్యుడు అభివృద్ధి దాత మన స్థానిక ఎమ్మెల్యే సతీష్ కూడ మూడోసారి ఎమ్మెల్యేగా అవ్వడం ఎవరు ఆపలేరని ఇందుకు నిదర్శనం మీ ఆదరాభిమానాలతో మాత్రమే సాధ్యమని ఆయన అన్నారు.