21.7 C
Hyderabad
Sunday, February 9, 2025
హోమ్తెలంగాణపట్టణాలలో క్రయ విక్రయాలకు..మరో కొత్త జిఓ ఎంఎస్ 84తో రెగ్యులరైజ్…

పట్టణాలలో క్రయ విక్రయాలకు..మరో కొత్త జిఓ ఎంఎస్ 84తో రెగ్యులరైజ్…

పట్టణాలలో క్రయ విక్రయాలకు..మరో కొత్త జిఓ ఎంఎస్ 84తో రెగ్యులరైజ్…

సిద్ధిపేట యదార్థవాది ప్రతినిది

సిద్ధిపేట జిల్లాలో నోటరీ ద్వారా పట్టణాలలో క్రయ విక్రయాలు కొన్న స్థలాలను రెగ్యులరైజ్ చేసుకోవడానికి జిఓ ఎంఎస్ 84 ద్వారా ప్రభుత్వం అవకాశం కల్పించిందని ఈ అవకాశాన్ని వినియోగించుకోవాలని జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ పత్రిక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి స్టాంపు డ్యూటీ చెల్లించకుండానే కేవలం నోటరీ ద్వారా పట్టణ ప్రాంతాల్లో కొన్న స్థలా క్రమబద్ధీకరించుకునేందుకు రాష్ట్ర ప్రభుత్వం అవకాశం కల్పించిందని 125 చదరపు గజాలు అంతలోపు ఉన్న స్థలాలను క్రమబద్ధీకరించేందుకు స్టాంప్ డ్యూటీ పెనాల్టీ చెల్లించసిన అవసరం లేదని, 125 చదరపు గజాలకు పైన 3000 చదరపు గజాల లోపు ఉన్న స్థలానికి మార్కెట్ వాల్యూ ప్రకారం స్టాంపు డ్యూటీ చెల్లించాల్సి ఉంటుందని, జీవో ఎంఎస్ 84 ప్రకారం దరఖాస్తు చేసుకునేవారు..

దరఖాస్తుకు ఉండవలసిన పత్రాలు.

  1. నోటరీ చేసిన డాక్యుమెంట్స్
  2. లింక్ డాక్యుమెంట్స్
  3. ప్రాపర్టీ టాక్స్ రసీదు
  4. ఎలక్ట్రిసిటీ బిల్ రషీద్
  5. వాటర్ బిల్ రషీద్
  6. ఇతర ఏమైనా రసీదులు ఉంటే వాటితో ఈ ఆగస్టు నుండి నవంబర్ 2023 లోపు మీసేవ కేంద్రాల ద్వారా దరఖాస్తు చేసుకోవాలని జిల్లా కలెక్టర్ తెలిపారు..
RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్