పశువులకు గర్భ కోశ నివారణ క్యాంపు
వెల్దుర్తి పశు వైద్య అధికారిని రేఖ రసజ్ఞ
వెల్దుర్తి మాసాయిపేట యదార్థవాది డిసెంబర్ 12: ఉచిత ఫెర్టిలిటీ క్యాంపు నిర్వహణ మెదక్ జిల్లా వెల్దుర్తి మండలం మన్నేపల్లి గ్రామంలో ఉచితంగా పశువులకు గర్భకోశ నివారణకు సంబంధించి ( ఫెర్టిలిటీ ) క్యాంపు ని మండల పాశువైద్యాధికారి రేఖ రసజ్ఞ ప్రారంభించారు. ఈ కార్యక్రమమును ఉద్దేశించి మండల పశువైద్య అధికారిని రేఖారాసజ్ఞ మాట్లాడుతూ గోజాతి గీత జాతి పశువులలో గర్భకోశ వ్యాధులకు సంబంధించి వైద్యం అందించడం జరిగిందని. పశువులకు చూడి నిర్ధారణ పరీక్షలు నిర్వహించడం జరిగిందని.ఈ వ్యాధులు రావడం వలన చూలు నిలబడక, ఎదకు రాకపోవడం, తిరిగి పొర్లడం, వంటి సమస్యల గురించి రైతు సోదరులకు వివరించి అవగాహన కల్పించడం జరిగిందని తెలియజేశారు. రైతులకు ఉన్నటువంటి పశువులకు ఎటువంటి సమస్యలు ఉన్న తన దృష్టికి తమ సిబ్బంది దృష్టికి తీసుకువస్తే సకాలంలో మీ వద్దకు వచ్చి మా సిబ్బంది పశువులకు వైద్యం చేయడం జరుగుతుందని మీకు మేము మా పశు వైద్య సిబ్బంది అందుబాటులో ఉంటామని ఆమె తెలియజేశారు మండల వ్యాప్తంగా మొత్తం ఈ ఫెర్టిలిటీ క్యాంపులో 120 పశువులు కు వైద్యం అందించడం జరిగిందని. ఆమె తెలియజేశారు ఈ కార్యక్రమంలో వి ఎల్ వో ఫజల్, గోపాల్ మిత్ర సూపర్వైజర్ సత్యనారాయణ, గోపాల మిత్రులు నవీన్, రమేష్,భాస్కర్, పశు వైద్య సిబ్బంది వెంకట్, గ్రామ ప్రజలు పాల్గొన్నారు.