33.6 C
Hyderabad
Friday, May 16, 2025
హోమ్తెలంగాణపార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండే..

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండే..

పార్లమెంటు భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండే..

-ఎన్నికల హామీలు అమలు చేయని కెసిఆర్ ప్రభుత్వం

-సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

భారత పార్లమెంటును నూతన భవనాన్ని రాష్ట్రపతి చేత ప్రారంభోత్సవం చేయించేదుండేనని సిపిఐ జాతీయ కార్యవర్గ సభ్యులు మాజీ ఎమ్మెల్యే చాడ వెంకటరెడ్డి ప్రధాన మంత్రి నరేంద్ర మోడీకి సూచించారు.
సోమవారం హుస్నాబాద్ పట్టణంలోని అనభేరి సింగిరెడ్డి అమరుల భవన్ లో ఏర్పాటు చేసిన విలేఖరుల సమావేశంలో ఆయన మాట్లాడుతూ నరేంద్ర మోడీ అధికారంలోకి వచ్చిన తర్వాత ఏకపక్షంగా నిర్ణయం తీసుకున్నారని ప్రశ్నించే ప్రతిపక్ష పార్టీల నేతలపై కక్షసాధింపు చర్యలకు పాల్పడుతు ఈడి, ఐటి అధికారుల చేత దాడులు చేయిస్తూ భయాందోళనలకు గురిచేస్తున్నారని ఇది సరైంది కాదని చాడ ధ్వజమెత్తారు.
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు ఎన్నికల ముందు ప్రజలను ఆకర్షించడానికి అనేక పధకాలను ప్రకటిస్తూ గద్దెనెక్కినంక ప్రజలకు ఇచ్చిన హామీలను అమలు చేయకుండా ప్రజలను మెసం చేస్తున్నారని దశాబ్ది ఉత్సవాల సందర్భంగా కెసిఆర్ ప్రభుత్వం ఎన్నికల ముందు పేదలకు ఇచ్చిన హామీలను తప్పకుండా అమలు చేయాలని చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. కెసిఆర్ ఎన్నికల హామీలను అమలు పేదలందరికీ డబుల్ బెడ్ రూం ఇండ్లు, ఇండ్ల స్థలాలు, నిరుద్యోగ భృతి, 57 ఏండ్లకే ఫించడ్లు పధకాలను అమలు చేసేంతవరకు సిపిఐ ప్రజా పోరాటాలను కొనసాగిస్తూనే ఉంటామని అన్నారు.
జూన్ 4న కొత్తగూడెంలో నిర్వహిస్తున్న సిపిఐ గర్జన విజయవంతం చేయాలని ప్రజలను విజ్ఞప్తి చేశారు.
కార్యక్రమంలో సిపిఐ జిల్లా కార్యదర్శి మంద పవన్, సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు ఎంపిపి గడిపె మల్లేశ్, సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు ఎడల వనేష్, జాగీర్ సత్యనారాయణ, సిపిఐ జిల్లా కౌన్సిల్ సభ్యులు బద్దిపడగ రాజారెడ్డి, అయిలేని సంజివరెడ్డి, ఏగ్గొజు సుదర్శన్ చారి, కొహెడ కొమురయ్య,
ననువాల ప్రతాప్ రెడ్డి, బైరగొని సరోజన, చిగురుమామిడి సిపిఐ మండల కార్యదర్శి నాగేల్లి లక్ష్మారెడ్డి, కోహెడ మండల కార్యదర్శి ముంజ గోపి, భారత జాతీయ మహిళా సమాఖ్య రాష్ట్ర నాయకురాల్లు గూడెం లక్ష్మి, జిల్లా అధ్యక్షురాలు గూడ పద్మ,ఏలురి స్వాతి,సిపిఐ మండల నాయకులు అయిలేని మల్లారెడ్డి,పోదిల కనకస్వామి, ఇజ్జగిరి కిష్టయ్య తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్