పిల్లలమర్రిలో ఘనంగా అయ్యప్ప పడిపూజ మహోత్సవం
సూర్యాపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 11
మున్సిపల్ పరిధిలోని పిల్లలమర్రి ఎరకేశ్వరస్వామి దేవాలయంలో బుధవారం అయ్యప్ప పడి పూజ మహోత్సవం ఘనంగా జరిగింది. ముందుగా గణపతి, సుబ్రమణ్య స్వాములకు ప్రత్యేక పూజలు నిర్వహించి అయ్యప్ప స్వామికి రంగురంగుల పండ్లు, పూలతో అభిషేకాలు నిర్వహించారు. అనంతరం అందంగా అలంకరించిన 18 మెట్లపై కర్పూరం జ్యోతులను వెలిగించి భక్తి శ్రద్ధలతో పూజలు చేశారు. కడారి వెంకన్న గురు స్వామి నిర్వహించిన పూజలో నల్లగొండ జిల్లా తిప్పర్తికి చెందిన ఈద సంజీవ ఆధ్వర్యంలో పాటలుపాడుతూ భజనలు చేశారు. ఈ కార్యక్రమంలో దాతలు, పిల్లలమర్రి దీక్షాస్వాములు, భక్తులు పాల్గొన్నారు.