పేదలకు అందని సర్కారు వైద్యం.
– దశాబ్ది ఉత్సవాలల్లో
ప్రజా వైద్యంపై ఎమ్మెల్యేవి
పచ్చి అబద్ధాలు..
– సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్..
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
తెలంగాణ రాష్ట్ర దశాబ్ది ఉత్సవాల సందర్భంగా ప్రజా వైద్యం అందరికి అందుబాటులో ఉందని చెప్పిన స్థానిక ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ పచ్చి అబద్ధాలు చెప్పారని సిపిఐ రాష్ట్ర సమితి సభ్యులు గడిపె మల్లేశ్ అన్నారు. గురువారం ఆయన విలేకరులతో మాట్లాడుతూ హుస్నాబాద్ లొ ఉన్న 50 పడకల ఆసుపత్రిలో 50 పడకలు లేవని ఆసుపత్రిలో పనిచేస్తున్న వైద్యులు అందరూ రోజు డ్యూటీకి రాకుండా సమయపాలన పాటించకుండ సక్రమంగా విధులకు రావడంలేదని డాక్టర్ లు వంతుల వారీగా డ్యూటీలు చేస్తున్నారని అనేక సార్లు రాష్ట్ర, జిల్లా స్థాయి అధికారుల, ఎమ్మెల్యే వొడితేల సతీష్ కుమార్ దృష్టికి పోయిన ఏమి పట్టనట్లు వ్యవహరిస్తున్నారని ఆసుపత్రి సూపరింటెండెంట్ డాక్టర్ రమేష్ రెడ్డి నిర్లక్ష్యం చేయడం వల్ల అనేక మంది రోగులు ఇబ్బందులు పడుతున్నారని తెలిసి కూడా ఎమ్మెల్యే దశాబ్ది ఉత్సవాల ప్రచారం కోసం ఆసుపత్రిలో రోగులకు సరిపడా మందులు, వైద్యులు, సిబ్బంది లేకపోవడంతో హుస్నాబాద్ ప్రాంత ప్రజలు అనేక ఇబ్బందులకు గురవుతున్నారని ఇప్పటికైనా ప్రభుత్వ ఆసుపత్రిలో పూర్తి స్థాయి వైధ్యులను, వసతులు, రోగులకు అత్యవసర పరిస్థితుల్లో అనువుగా ఉండేటట్లు ఎమ్మెల్యే సతీష్ కృషి చేయాలని గడిపె మల్లేశ్ కోరారు.