పేదింటి వధువుకు పుస్తె మట్టెలు
సిద్దిపేట, యదార్థవాది ప్రతినిధి, డిసెంబర్ 6:
అందించిన సిద్దిపేట పట్టణ పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు కాముని రాజేశం శుక్రవారం సిద్దిపేట కేసీఆర్ నగర్ రెండు పడకల ఇండ్లు లో నివాసముంటున్న నిరుపేద కుటుంబానికి చెందిన కూరపాటి పుష్ప- బాలరాజు ఏకైక పుత్రిక రుచిత ( భార్గవి ) వివాహానికి సిద్దిపేట పద్మశాలి సమాజం మాజీ అధ్యక్షుడు కాముని రాజేశం కుటుంబ సభ్యులు పుస్తె మట్టెలను అందజేశారు. కాముని రాజేశం మాట్లాడుతూ సిద్దిపేట పట్టణంలోని నిరుపేదలకు సేవ చేయడంలో ఎంతో ఆనందంగా ఉంటుందని, సమాజంలో కొంత మంది అహనిషలు కష్టపడ్డ ఉన్నత వర్గంగా ఎదగలేక పోవచ్చు కానీ వారి ఆత్మాభిమానం ముందు మనం ఎంతిచ్చిన తక్కువే.. పేదవారికి సేవచేయంలో ఉన్న తృప్తి కోట్లు సంపాదించినరదని, నేను చేసిన సహాయం చాల చిన్నడాని కాముని రాజేశం అన్నారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట పద్మశాలి సమాజం మాజీ ఉపాధ్యక్షుడు ఇప్ప కాయల శ్రీహరి మామిడాల తిరుపతి కాముని నగేశ్ పాల్గొన్నారు.