పోలింగ్ కేంద్రాలను క్షేత్రస్థాయిలో పరిశీలించాలి: కలెక్టర్ జీవన్ పాటిల్
సిద్దిపేట యదార్థవాది
హుస్నాబాద్ ఆర్డీఓ కార్యాలయంలో మంగళవారం హుస్నాబాద్ నియోజకవర్గ, మున్సిపల్ రెవెన్యూ అధికారులతో కలెక్టర్ ప్రశాంత్ జీవన్ పాటిల్ సమావేశం నిర్వహించారు..ఈ సమావేశంలో కలెక్టర్ మాట్లాడుతూ జూలై 11న జరిగిన సమావేశానికి నేటి రోజు చుస్తే పనుల్లో చాలా పురోగతి సాధించారని అభినందిస్తు ఇంతే వేగంగా జాబితా సవరణ పూర్తి చెయ్యాలన్నారు. ఓటర్ జాబితా సవరణలో భాగంగా డ్రాఫ్ట్ ఓటరు జాబితా విడుదల ముందు, మనకు వచ్చిన ప్రతి దరఖాస్తు పూర్తి చేయాలని, ఓటరు జాబితా నుంచి తొలగించిన ఓటర్ల వివరాలను క్షేత్రస్థాయిలో ధృవీకరణ పూర్తి చేయాలని, బిఎల్ఓస్ ఇంటింటికి తిరిగి 6 కంటే అధికంగా ఉన్న ఓటర్ల వివరాల ధృవీకరణను పూర్తి చేయాలని సిద్దిపేట జిల్లాలో ఇంటింటి సర్వే నేపథ్యంలో వచ్చిన దరఖాస్తులు, ఆన్ లైన్ ద్వారా ఫారం 6, ఫారం 7, ఫారం 8 క్రింద వచ్చిన దరఖాస్తులను జూలై 27 నాటికి ఫీల్డ్ వెరిఫికేషన్ పూర్తి చేయాలని అన్నారు. ఓటరు జాబితా నుంచి ఓటర్ల వివరాలు తొలగించిన నేపథ్యంలో దానికి గల కారణాలను స్పష్టంగా తెలియజేయాలని, నియోజకవర్గ పరిధిలో ఈవిఎం, వివిప్యాట్ వినియోగం పై విస్తృతఅవగాహన కార్యక్రమాలు నిర్వహించాలని, నియోజకవర్గంలో ఉన్న మండలాల్లో ఉన్న పోలింగ్ స్టేషన్ లను క్షేత్ర స్థాయిలో వెళ్ళాలని, భారత ఎన్నికల సంఘం నిర్దేశించిన విధంగా ప్రతి పోలింగ్ స్టేషన్ లో మౌలిక ఏర్పాటు చెయ్యాలని తహసీల్దార్ లకు సూచించారు. బిఎల్ఓస్, ఈఆర్ఓలు, అందరు అధికారులు సమన్వయంతో పనిచేసి మళి విడత సమావేశం లోపు అన్ని పూర్తి చెయ్యాలని అధికారులను ఆదేశించారు. సమావేశంలో ఆర్డిఓ బెన్ సాలమ్, మున్సిపల్ కమిషనర్ రాజమల్లయ్య తదితరులు పాల్గొన్నారు.