పోలీసు ఉద్యోగాల సర్టిఫికెట్ వెరిఫికేషన్ కు 483 మంది గైర్హాజరు: పోలీస్ కమిషనర్ శ్వేత
సిద్దిపేట యదార్థవాది
తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్ఐ పోలీసు ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన అభ్యర్థుల సర్టిఫికెట్ వెరిఫికేషన్ పకడ్బందీగా పారదర్శకంగా పూర్తి చేయడం జరిగిందని పోలీస్ కమిషనర్ ఎన్. శ్వేత తెలిపారు.. ఈ సందర్భంగా కమిషనర్ మాట్లాడుతూ తెలంగాణ స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్మెంట్ బోర్డు నిర్వహించిన కానిస్టేబుల్, ఎస్ఐ పోలీసు ఉద్యోగాల ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన (3926) మంది అభ్యర్థులకు పోలీస్ కమిషనర్ కార్యాలయంలో సర్టిఫికెట్స్ వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగిందని అన్నారు. వెరిఫికేషన్ నోడల్ అధికారిగా నియమింపబడిన అడిషనల్ డిసిపి అడ్మిన్ ఎస్. మహేందర్ ఆధ్వర్యంలో వెరిఫికేషన్ కొనసాగిందని గత పది రోజుల నుండి అభ్యర్థులు తమ కేటాయించిన స్థలాలలో వేచి ఉండి సర్టిఫికెట్ వెరిఫికేషన్ ను ప్రశాంతంగా చేయించుకున్నారు. మహిళా అభ్యర్థులకు మొదటి ప్రాధాన్యతగా కేటాయించి సర్టిఫికెట్ వెరిఫికేషన్ పూర్తి చేయడం జరిగింది. అభ్యర్థులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా అన్ని ఏర్పాట్లను పూర్తి చేసినట్లు కమిషనర్ పేర్కొన్నారు. ఫైనల్ రాత పరీక్షలో అర్హత సాధించిన 4409 మంది అభ్యర్థుల ఉండగా, వెరిఫికేషన్ కు హాజరైన అభ్యర్థులు 3926, మిగత 483 మంది గైరాజరైనారు ఎలాంటి ఇబ్బంది లేకుండా పారదర్శకంగా వెరిఫికేషన్ నిర్వహించిన పోలీస్ అధికారులను సిబ్బందిని పోలీస్ కమిషనర్ అభినందించారు. కార్యక్రమంలో సూపరిండెంట్లు ఎస్.కె జమీల్ పాషా, మహ్మద్ ఫయాజుద్దీన్, మహ్మద్ అబ్దుల్ ఆజాద్, సీనియర్ అసిస్టెంట్లు సతీష్, సాగర్, శ్రీధర్, మరియు జూనియర్ అసిస్టెంట్లు, ఐటీ కోర్ ఎస్ఐ శ్రీకాంత్, మహిళ ఆర్ఎస్ఐ పుష్ప, ఆర్ఐ శ్రీధర్ రెడ్డి, ఐటీ కోర్స్ సిబ్బంది, పోలీస్ సిబ్బంది మరియు తదితరులు పాల్గొన్నారు..