27.7 C
Hyderabad
Tuesday, February 11, 2025
హోమ్తెలంగాణప్రకృతి వైపరీత్యాలతో జాగ్రత్త ఉండాలి.

ప్రకృతి వైపరీత్యాలతో జాగ్రత్త ఉండాలి.

ప్రకృతి వైపరీత్యాలతో జాగ్రత్త ఉండాలి.

హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది

హుస్నాబాద్ నియోజకవర్గంలో కన్నారం గ్రామంలో వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన వ్యక్తి కుటుంబ సభ్యులను కట్కూరు గ్రామంలో ఇటీవల మృతి చెందిన వారి కుటుంబ సభ్యులను పరామర్శించిన రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్, ఎమ్మెల్యే వొడితల సతీష్ కుమార్.. అక్కన్నపేట మండలం కన్నారం గ్రామంలో గత నాలుగు రోజుల క్రితం చెరువు మత్తడి వాగులో కొట్టుకుపోయి మృతి చెందిన పొన్నాల మహేందర్ కుటుంబాన్ని శనివారం రాష్ట్ర ప్రణాళిక సంఘం ఉపాధ్యక్షులు బోయినపల్లి వినోద్ కుమార్ హుస్నాబాద్ శాసనసభ్యులు వొడితల సతీష్ కుమార్ పరామర్శించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మహేందర్ మృతి చాలా బాధాకరమని, అతని అన్న, తండ్రి గతంలో మరణించారని అతని తల్లి మాత్రమే ఉన్నారని ఒక్కగానొక్క కొడుకు ఆ తల్లికి ఆసరాగా నిలుస్తాడ అనుకుంటే ఈ విధంగా జరగడం బాధాకరమని, గత 50 సంవత్సరాలలో ఇంతటి భారీ వర్షాలు ఎప్పుడూ కురవలేదని రాష్ట్రవ్యాప్తంగా వాగులు వంకలు చెరువులు నుండి మత్తల్లు పారుతున్నందున ప్రజలందరూ గమనించి ప్రకృతి వైపరీత్యాలు సంభవించినప్పుడు స్వీయ నియంత్రణ పాటించాలని చిన్న అజాగ్రత్త వారి కుటుంబానికి గర్భశోకాన్ని మిగులుస్తుందని తెలిపారు. అలాగే హుస్నాబాద్ నియోజకవర్గం లో దాదాపు 700 పైచీలుకు చెరువులు కుంటలు అన్నీ నిండి నిండుకుండలా ఉన్నాయని ఎక్కడ ఎలాంటి నష్టం జరగలేదని దేవుని దయ వల్ల వర్షాలు తగ్గుముఖంపడ్డాయని అనంతరం కట్కూర్ గ్రామంలో బీఆర్ఎస్ పార్టీ గ్రామ శాఖ అధ్యక్షులు బడుగు రామచంద్రయ్య తల్లి ఈశ్వరమ్మ ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను గ్రామానికి చెందిన నారాయణరెడ్డి తల్లి ఇటీవల మృతి చెందగా వారి కుటుంబ సభ్యులను పరామర్శించి సంతాపం తెలిపారు.

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్