30.2 C
Hyderabad
Saturday, January 25, 2025
హోమ్తెలంగాణప్రజలకి మరింత చేరువలో

ప్రజలకి మరింత చేరువలో

ప్రజలకి మరింత చేరువలో

“ఠాణా దివస్” కు విశేష స్పందన జిల్లా ఎస్ పి అఖిల్ మహాజన్..

యదార్థవాది ప్రతినిది వేములవాడ

రాజన్న సిరిసిల్ల జిల్లాలో “ఠాణా దివస్” కార్యక్రమాన్ని మొదటి సారిగా వేములవాడ రూరల్ పోలీస్ స్టేషన్ లో మంగళవారం ప్రారంభించిన జిల్లా ఎస్పీ అఖిల్ మహాజన్… గ్రామాల్లో క్షేత్ర స్థాయిలో నెలకొన్న భద్రత సమస్యలు ఫిర్యాదులను పరిష్కారం కోరకు పోలీస్ శాఖ ఆధ్వర్యంలో విన్నూతంగా చేపట్టిన “ఠాణా దివస్” కార్యక్రమానికి అనూహ్య స్పందన లభించింది. ఉదయం 11:00 గంటల నుండి సాయంత్రం 3:00 గంటల వరకు జిల్లా ఎస్పీ ప్రజలకు అందుబాటులో ఉండి వారి వద్ద నుండి 49 అర్జీలు స్వీకరించి సమస్యల పరిష్కారం కోసం వెనువెంటనే అధికారులు చర్యలు చేపట్టేలా ఆదేశాలు ఇచ్చారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ప్రజలకు మరింత చేరువగా వెళ్ళడానికి “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ఏర్పాటు చేశామని ప్రజల వద్ద నుండి ఫిర్యాదులు స్వయంగా స్వీకరించి వారి సమస్యలని అడిగి తెలుసుకుని అట్టి సమస్యల పరిష్కారం కోసం సంబదిత అధికారులకు పంపివ్వడం జరుగుతుందని ఈ విషయంలో కలెక్టర్ కు భూ సమస్యలను తీసుకవెళ్ళడం సమస్యల పరిష్కారం అయ్యేంతవరకు ఎప్పటికప్పుడు పర్యవేక్షించడం జరుగుతుందని భూ సమస్యలలో క్రిమినల్ సమస్య ఉంటే వాటిలో సంబంధించిన అధికారులకి ఆదేశాలు ఇచ్చి FIR నమోదు చేయాలని ప్రజలను భయభ్రాంతులకు గురి చేస్తూ భూములను ఆక్రమించే వారిపై క్రిమినల్ కేసులతో పాటు పిడి ఆక్ట్ నమోదు చేయాలని తెలిపారు. సివిల్ సమస్యలకు సంబంధించి సమస్యలలో లీగల్ సర్వీసెస్ అథారిటీ వాళ్ళతో అవగాహన కల్పించడంతో పాటు రిటైర్ MRO మరియు డిఎస్పీ ఆధ్వర్యంలో అవగాహన కార్యక్రమలు ఏర్పాటు చేస్తామని భార్య భర్తల గోడవల్లో భర్తకు దూరంగా ఉంటున్న భార్యకు జీవన భత్యం కొరకై లీగల్ సర్వీసెస్ అథారిటీతో మాట్లాడి భర్తల నుండి ఇప్పించే విధంగా చర్యలు చేపట్టాలని అధికారులకు ఆదేశాలు ఇస్తామన్నారు. ప్రజా సమస్యల పరిష్కారమే ఇతివృత్తంగా క్షేత్ర స్థాయిలో నెలకొన్న సమస్యలను విన్నపాలు స్వీకరించి వాటిని సాధ్యమైనంత త్వరగా పరిష్కరించడం జరుగుతుందని “ఠాణా దివస్” కార్యక్రమాన్ని ప్రతి నెల మొదటి మంగళవారం ఒక పోలీస్ స్టేషన్లో నిర్వహించడం జరుగుతుంది అ పోలీస్ స్టేషన్ పరిధిలోని గ్రామాల ప్రజల నుండి అర్జీలను స్వయంగా స్వీకరించి దీర్ఘకాలికంగా పెండింగ్ లో ఉన్న కేసులను చట్టపరంగా పరిష్కరించనున్నట్లు తెలిపారు. జిల్లా ఎస్పీ స్వయంగా తమ దగ్గరికి వచ్చి తమ ఫిర్యాదులను స్వీకరించడం సంతోషంగా ఉందని అర్జీదారులు తమ అభిప్రాయం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో డిఎస్పీ నాగేంద్రచారి, సి.ఐ లు బన్సీలాల్, వెంకటేష్, ఎస్.ఐ లు నాగరాజు,రఫిక్ ఖాన్, సిబ్బంది పాల్గొన్నారు..

RELATED ARTICLES

ఒక సమాధానం వదిలి

దయచేసి మీ వ్యాఖ్యను నమోదు చేయండి!
దయచేసి ఇక్కడ మీ పేరు నమోదు చేయండి

ట్రెండింగ్ న్యూస్