ప్రజలకు సేవకుడిగా పనిచేస్తా: మంత్రి పొన్నం
హుస్నాబాద్ యదార్థవాది ప్రతినిది
క్రిస్టమస్ సందర్భంగా హుస్నాబాద్ నియోజకవర్గంలోని నిరుపేద క్రైస్తవులకు శనివారం హుస్నాబాద్ పట్టణంలోని లక్ష్మి గార్డెన్ లో బట్టలు పంపిణీ చేసిన మంత్రి పొన్నం కార్యక్రమాన్ని ప్రభుత్వం అధికారికంగా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి రాష్ట్ర రవాణా బీసీ సంక్షేమశాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ ముఖ్య అతిథిగా హాజరై పేద క్రైస్తవులకు బట్టలను పంపిణీ చేసి మంత్రి మాట్లాడుతూ ప్రజలకు నాయకుడిని కాదు ఒక సేవకుడిగా పనిచేస్తా అభివృద్ధి అనేది నిరంతర ప్రక్రియ తప్పకుండా అన్ని మతాలను మా ప్రభుత్వం తప్పకుండా గౌరవిస్తూందని ప్రజాస్వామ్య ప్రజాపాలన ఇనుప కంచెలను ప్రగతి భవనంలో తొలగించి ప్రజలకు వేదికగా మార్చడం అటువంటి పాలన అంశం గ్రామాల దాక రాభోతుందని అన్నారు. హుస్నాబాద్ ప్రజలు ఆశీర్వదిస్తే మీ సేవకునిగా బాధ్యతను తీసుకొని మంత్రిగా ప్రమాణ స్వీకారం చెసి ఇవాళ 23 తారీకు 16 రోజులైంది హుస్నాబాద్ లో మోడల్ స్కూల్లో సమస్యకు వెంటనే స్పందించాను ప్రియాంక గాంధీ మెడికల్ కళశాల ఏర్పాటు ఆర్టిఏ కార్యాలయంలో యువకులకు డ్రైవింగ్ లైసెన్స్ అందించే విదంగా ట్రాక్ ఇతరత్రా అవసరాల కోసం భవనానికి స్థలాలను అన్వేషణ చేపట్టాలని అన్నారు. ప్రభుత్వం రాగానే మహాలక్ష్మి పేరుతో ఆర్టీసీ బస్సులో మహిళలకు ఉచిత ప్రయాణం 10 లక్షల ఆరోగ్య భీమా సౌకర్యాన్ని అందించామని గౌరవెల్లి డిస్ట్రిబ్యూషన్ కెనాల్ సమస్య తప్పకుండా పరిష్కారించి ఆదుకుంటామని అన్నారు. క్రైస్తవులకు సంబందించి హక్కులు విషయాలలో ఎవరికి ఎలాంటి భంగం కలగకుండా ఒక ప్రతినిధిగా రాజకీయ హోదా అనేది ప్రజలకు సెవచెసే విధంగా నియోజకవర్గాన్ని ఆదర్శవంతంగా తీర్చుదిద్దుతా ప్రశంస పోందే విధంగా పాలన కొనసాగిస్తానని అన్నారు.
అందరికీ క్రీస్టమస్ శుభాకాంక్షలు మీ ప్రేమకు ధన్యవాదాలు.
ఈ సమావేశంలో జిల్లా కలెక్టర్ ప్రశాంత్ జె పాటిల్ మాట్లాడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి ఆదేశాల మేరకు క్రిస్టమస్ పర్వదినం సందర్భంగా నిరుపేద క్రైస్తవులకు బట్టల పంపిణీ కార్యక్రమం మంత్రి చేతుల మీదుగా జరుపుతున్నాం అన్నారు. ఈ సమావేశంలో క్రైస్తవ మతాది పెద్దలు ఆర్డీఓ బెన్ షాలం జెడ్పీటీసీలు ఎంపిపిలు ఇతర ప్రజాప్రతినిధులు అదికారులు తదితరులు పాల్గొన్నారు